ధార్వాడ్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ మహిళను.. వ్యాపారవేత్తకు అమ్మేశాడు. తనను అమ్మేసిన విషయం గుర్తించిన మహిళ వ్యాపారి చెర నుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ధార్వాడ్ తాలూకాలోని ఉప్పిన్ బెటాగేరిలో నివసిస్తున్న ఒక మహిళ పేదరికంతో బాధపడుతున్నది. ఇదే ప్రాంతంలోని అమీనాభవికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి ధార్వాడ్ తాలూకాలోని కేసీ పార్క్ సమీపంలోని దుకాణంలో పనిచేస్తున్నప్పుడు మహిళతో పరిచయం ఏర్పడింది.
అమె సమస్యను గుర్తించిన దిలీప్ ఇంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. బెంగళూరులో ఉద్యోగం పొందడానికి సహాయం చేస్తానని నిందితుడు మహిళకు హామీ ఇచ్చాడు. నిందితుడి ఉద్దేశాలను అనుమానించకుండా సదరు మహిళ అతనితో వెళ్లాలని నిర్ణయించుకుంది.
దిలీప్ ఆ మహిళను అహ్మదాబాద్కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్త ఇంట్లో సహాయకురాలి పనికి కుదిర్చాడు. నెల రోజుల తరువాత వ్యాపారవేత్త ఇంటికి వచ్చిన దిలీప్.. ఆ మహిళకు ఇంతకన్నా మంచి ఉద్యోగం ఉన్నదని అక్కడ ఉద్యోగం మాన్పించి తనతో తీసుకెళ్లాడు. ఆ మహిళను గుజరాత్-రాజస్థాన్ సరిహద్దులోని పదన్పూర్కు తీసుకెళ్లి ఒక వ్యాపారవేత్తకు రూ.2 లక్షలకు విక్రయించాడు.
తనను విక్రయించినట్లు ఆ మహిళ తెలుసుకుని వ్యాపారి ఇంటి నుండి పారిపోయి అహ్మదాబాద్ చేరుకున్నది. అక్కడ ఆమె గతంలో పనిచేసిన కుటుంబాన్ని సంప్రదించింది జరిగిన విషయాన్ని చెప్పింది. వారి సహాయంతో ఆ మహిళ తన ఇంటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది.
మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితులను గుర్తించారు. నిందితుడు దిలీప్ను గుజరాత్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్లు ఇన్స్పెక్టర్ వైడీ అగసిమణి తెలిపారు.
వర్చువల్గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న దావానలం
అణగారిన వర్గాల గొంతుక బాబుజీ.. చరిత్రలో ఈరోజు
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్
ఇండోనేషియాలో భారీ వర్షాలు.. 23 మంది మృతి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..