లిఫ్ట్ ఆఫర్ చేసి దోచుకునే దోపిడి దొంగలు అరెస్టు

ఢిల్లీ : పోలీసులుగా చెప్పుకుంటూ రహదారి వెంట వేచిఉన్న వ్యక్తులకు లిఫ్ట్ ఆఫర్ చేసి అనంతరం వారిని దోచుకునే దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని నగరం ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితులను లిఫాఫెబాజ్ ముఠాకు చెందిన రోబీ(40), రకుల్ కుమార్(29), అలిక్ అబ్రహం(37), రాహుల్(27)గా గుర్తించారు. రోడ్డు వెంట బస్సు, ట్యాక్సీ కోసం వేచి చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని లిఫ్ట్ ఇచ్చేవారు. మార్గమధ్యంలో ముందు పోలీస్ చెకింగ్ ఉందని చెప్పి వారి వద్ద ఉన్న నగదును, ఇతర విలువైన వస్తువులను కవర్లో ప్యాక్ చేసేవారు. అనుమానం రాకుండా నిందితుల్లోని ఒకరు కూడా తన వద్ద ఉన్న వస్తువులను మరో కవర్లో ప్యాక్ చేసేవాడు. కొన్నిసార్లు ఏటీఎం పిన్ నెంబర్ను సైతం అడిగి తెలుసుకునేవారు. ఇలా ప్రయాణం కొనసాగించి గమ్యస్థానం చేరిన తర్వాత కవర్లను మార్చి సదరు వ్యక్తులకు ఇచ్చేవారు. ఇంటికి వెళ్లి కవర్ను తెరిచి చూసి తాము మోసపోయినట్లుగా కనుగొనేవారు బాధితులు. మరోవైపు దొంగలు ఏటీఎం కార్డు పిన్ నెంబర్తో డబ్బులు డ్రా చేసి ఊడాయించేవారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(సౌత్) అతుల్ కుమార్ థాకూర్ మాట్లాడుతూ... గడిచిన సోమవారం నాడు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు వలపన్ని ముఠా సభ్యులను పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద దొరికిన వస్తువులు, విచారణలో వెల్లడించిన విషయాల ప్రకారం నలుగురు సభ్యులు లిఫాఫెబాజ్ ముఠాకు చెందినవారిగా గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద దొంగిలించిన ఆరు మొబైల్ ఫోన్లు, నగలు, 14 కవర్లు, వాకీ టాకీ, పోలీసు యూనిఫాంలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరు ప్రయాణించే కారు సైతం కొట్టేసినదిగా గుర్తించారు. నిందితులంతా కరడుగట్టిన నేరగాళ్లు అని చీటింగ్, దొంగతనాలు, దోపిడీ, ఆయుధాల కేసుల్లో ఉన్నారన్నారు.
తాజావార్తలు
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
- భారత్ చేరిన మరో మూడు రాఫెల్స్
- ఎస్ఈసీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు : సజ్జల