అదుపు తప్పి బోల్తా పడ్డ లారీ.. ఇద్దరు మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి బేగంబజార్ వైపు వస్తున్న లోడ్తో వస్తున్న లారీ ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో వేగంగా వస్తూ హిమాయత్సాగర్ ఎగ్జిట్-17 వద్ద డైవర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ బోల్తా పడడంతో లారీ డ్రైవర్తో సహా క్లీనర్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వీరిని మున్నా, శరత్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. లారీ లోడ్లో పప్పులతో పాటు జర్దా ప్యాకెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వేగంగా వస్తూ అదుపు తప్పి డివైజర్ను ఢీకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. జర్దా ప్యాకెట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు? బేగంబజార్లో ఎక్కడ డంప్ చేస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మొబైల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతిచెందిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.
తాజావార్తలు
- ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్ 2021 అవార్డు అందుకున్న హైదరాబాదీ
- పనస పండు తింటే కలిగే లాభాలేంటి?
- డిజిటల్ పేమెంట్స్: దిగ్గజాల మధ్య పోటీ.. ఎవరెవరు ఎటువైపు?
- షుగర్ కంట్రోల్కు మెరుగైన ఆహారాలు..!
- పోలీసుల అదుపులో యూట్యూబ్ ఫేమ్ షణ్ముక్ జశ్వంత్
- ముగిసిన మేడారం మినీ జాతర
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికే దిక్సూచి
- 120హెచ్జడ్ డిస్ప్లేతో రెడ్మి నోట్ 10 సిరీస్!
- అసోం ఎన్నికల్లో పోటీ చేస్తాం: తేజశ్వి యాదవ్
- ఇండియా, ఇంగ్లండ్ వన్డే సిరీస్.. ఫ్యాన్స్కు నో ఎంట్రీ