హరితహారం మొక్కలను సంరక్షించాలి : దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
భూత్పూర్, జూన్ 20 : భూత్పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలో మహబూబ్నగర్ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ కృషితో రూ.20కోట్లు మంజూరు చేయించానని, పనులకు టెండర్లు వేయించామని తెలిపారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ బతికించుకోవాలన్నారు. చెట్లతోనే మానవ మనుగడ, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రం నుంచి కొత్త కలెక్టరేట్ వరకు రోడ్లకు ఇరుపక్కలా మొక్కలు, లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాసులు, కమిషనర్ నూరుల్నజీబ్, సింగిల్విండో చైర్మన్ కదిరె అశోక్రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, నాయకులు సత్తూర్నారాయణగౌడ్, చంద్రశేఖర్గౌడ్, సత్యనారాయణ, సాయిలు, వెంకట్రాములు, రాములు, నర్సింహులు, వెంకటయ్య, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత
దేవరకద్ర రూరల్, జూన్ 20 : చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామానికి చెందిన సద్దాం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వైద్యఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.లక్షా 50వేలు మంజూరు చేయించారు. దీనికి సంబంధించిన ఎల్వోసీని ఎమ్మెల్యే ఆల ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
నాన్నకు ప్రేమతో…
ఫాదర్స్డేను పురస్కరించుకొని ఆదివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డికి ఆయన కూతురు ప్రీతి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఓ కవితను అందజేశారు.