ఉప్పల్, జూన్ 12: ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ డివిజన్కు చెందిన సుస్మితకు రూ.60వేలు, సురేఖకు రూ.60వేలు, అబ్దుల్ గఫార్కు రూ.60వేలు, మల్లేశ్కు రూ.40వేలు, జంగయ్యకు రూ.32వేలు, సంగీతకు రూ.28 వేలు, సత్యమ్మకు రూ.22వేలు, అనితకు రూ.16వేలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల సంతోష్రెడ్డి, సుధాకర్, మైసయ్య, నరసింహ, నాగుల సురేశ్, ఆథిల్ పాష పాల్గొన్నారు.
ఉప్పల్ వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శనివారం హబ్సిగూడలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. కమ్యూనిటీహాల్ నిర్మాణం, డ్రైనేజీ, బోర్వేల్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి, గరిక సుధాకర్, అసోసియేషన్ ప్రతినిధులు రాజేశ్గౌడ్, నవీన్, కృష్ణంరాజు, సురేశ్, రాజేశ్, రవి, లక్ష్మణ్, ఆథిల్పాష పాల్గొన్నారు.