వరంగల్ రూరల్ : వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..జిల్లాలోని వర్ధన్నపేట పురపాలక సంఘం ఎస్సీ కమ్యూనిటీ హాల్ సమీపంలో.. ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు వర్ధన్నపేట పట్టణానికి చెందిన మల్లెపాక తిలక్ (30)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరికలు
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన