మెదక్ : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన జిల్లాలోని రామాయంపేట బైపాస్ రోడ్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేగుంట మండలం పులిమామిడి గ్రామానికి చెందిన మందాపురం రాజయ్య(55) తన కొడుకు పెండ్లి కోసం రామాయంపేటలో పుస్తె మట్టెలు కొనుగోలు చేశాడు. తిరుగు ప్రయాణంలో బైక్పై దామరచెర్వు బైపాస్ మీదుగా వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
తహసీల్దార్ ఆఫీస్కు తాళి కట్టిన ఘటనపై విచారణ
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా : ఎమ్మెల్యే పట్నం
పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి