అబ్దుల్లాపూర్మెట్ : లారీ ఢీకోని ఓ మహిళా మృతిచెందిన సంఘటన గురువారం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్పేట మున్సిపాలిటి పసుమాముల కళానగర్కు చెందిన ఆలేటి స్వామి(45) భార్య గంగమ్మ ఇద్దరు కలిసి చౌటుప్పల్ సమీపంలో గల లక్కారంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. బాటసింగారం హెచ్పి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే టీఎస్05యుబి1125 నం. గల లారీ అతివేగంతో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనంపై వెలుతున్న గంగమ్మకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గంగమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.