ములుగు : జిల్లాలో ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండల పరిధిలో మందుపాతర సంఘటన కలకలం రేపింది. రాచపల్లి-మల్లాపురం గ్రామ సమీపంలోని పాలెంవాగు ప్రాజెక్ట్ ఎర్త్ డ్యాంపై ఆదివారం రాత్రి మందుపాతర పేలడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కూంబింగ్కు వెళ్లే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఈ మందుపాతర అమర్చినట్లు తెలుస్తోంది.
ఈ మందుపాతర సుమారు రెండు సంవత్సరాల క్రితం మావోయిస్టులు అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తోడు పిడుగుల శబ్దానికి ఈ మందుపాత్ర పేలి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది.
మందుపాతర పేలిన ప్రాంతంలో ఓ పెద్ద గుంత ఏర్పడింది. ఈ విషయమై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
శాస్త్రబద్దంగా యాదాద్రి శివాలయ నిర్మాణం
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి
ఆక్సిజన్ మిగులు నిల్వల ఏర్పాటు : కేంద్రానికి సుప్రీం ఆదేశం