హైదరాబాద్ : యజమానులకు తెలియకుండానే వారి భూములు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లిలో చోటుచేసుకుంది. బాచుపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారులు ఆకేశ్రెడ్డి, చిన్నపరెడ్డిపై సనత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం చేశారని దాసరి కిరణ్ అనే బాధితుడు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నకిలీ పత్రాలతో స్థిరాస్తి మోసాలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్ కేసు వివరాలను మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ప్రధాన నిందితుడు ఆదినారాయణమూర్తితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమి విక్రయిస్తామని చెప్పి రూ.56 కోట్లు ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. ఈ విషయమై నిందితుడు ఆదినారాయణమూర్తి రూ.8.5 కోట్లు అడ్వాన్స్ వసూలు చేశౠడు. అగ్రిమెంట్ చేయాలన్న బాధితుడి ఒత్తిడితో మరోసారి మోసానికి పాల్పడ్డాడు.
భూమి తన పేరిట మార్చినట్లు నిందితుడు నకిలీ పత్రం పంపాడు. అసలు పత్రాల కోసం నిలదీయడంతో మోసం బయటపడిందన్నారు. మహబూబ్నగర్ తహసీల్దార్, ఆర్డీవో పేరుతో నకిలీ రబ్బర్ స్టాంపులు సృంష్టించినట్లు తెలిపారు. ముఠా నుంచి 246 నకిలీ పత్రాలు, 9 రబ్బర్ స్టాంపులు, 54 పట్టాదారు పాస్పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆదినారాయణమూర్తికి 9 స్థిరాస్తి సంస్థలున్నట్లు తేలిందని సీపీ వెల్లడించారు.