లాహోర్: పాకిస్తాన్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఇంటికి సమీపంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నగరంలోని జోహర్ పట్టణంలో హఫీజ్ నివాసానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఈ పేలుడు చోటుచేసుకుంది.
పేలుడు ధాటికి సమీపంలోని ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమైనట్లు లాహోర్ పోలీసులు తెలిపారు. గాయపడిన 21 మందిలో ఓ పోలీస్ అధికారి సహా మహిళలు, చిన్నారులు ఉన్నారని, గాయపడ్డ వారిని జిన్నా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు.