ముంబై : నకిలీ కొవిడ్-19 టెస్ట్ రిపోర్టులు ఇస్తున్న ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమర్గా గుర్తించిన ల్యాబ్ టెక్నీషియన్ గత నెలరోజుల్లో 35 మందికి నకిలీ టెస్ట్ రిపోర్టులు ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.ఉమర్ ఇచ్చిన తన కరోనా వైరస్ టెస్ట్ రిపోర్ట్లో తప్పులున్నాయని 31 ఏండ్ల చారు చౌహాన్ అనే మహిళ చర్కోప్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో ఆమెకు టెక్నీషియన్ నకిలీ కొవిడ్ రిపోర్టును ఇచ్చినట్టు వెల్లడైంది. గతంలో ఆమెకు నెగెటివ్గా వచ్చిన పాత రిపోర్టుల్లోని పీడీఎఫ్ ఫైల్స్లో మార్పులు చేస్తూ కొవిడ్-19 తాజా టెస్టుకు సంబంధించి నకిలీ రిపోర్టు ఇచ్చాడు. 37 మందికి ఆ టెక్నీషియన్ ఇలా నికలీ టెస్టు రిపోర్టులు ఇచ్చినట్టు గుర్తించారు. ఫోర్జరీ, మహమ్మారి నిబంధనల ఉల్లంఘన కింద ఉమర్ను శుక్రవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.