కులకచర్ల : బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు. కులకచర్లకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. బాలిక తండ్రి గ్రామంలో, చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించక పోవడంతో పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన మొండిశ్రీనుపై అనుమానం ఉందని, అతనే మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చుననే విషయాన్ని ఫిర్యాదులో తెలియజేశారు.
ఈ విషయంపై కిడ్నాప్ కేసుకింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. దీంతో శ్రీనును పట్టుకొని విచారించగా బాలికను పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అమ్మాయిని సఖీసెంటర్కు తరలించి నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.