ఎల్బీనగర్ : మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్పై అవాకులు, చెవాకులు పేలితే సహించేది లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లి కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడిన టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జీ ఎండీ జహీర్ఖాన్, జిల్లా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు పాండుగౌడ్లను మోహన్నగర్లోని జహీర్ఖాన్ నివాసానికి వెళ్లి సుధీర్రెడ్డి పరమార్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన టీఆర్ఎస్వీ నాయకులపై దాడిని ఆయన ఖండించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డీ. జహీర్ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్ను, మంత్రి కేటీఆర్పై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. రేవంత్రెడ్డి మరోసారి కేటీఆర్పై తప్పుడు వాఖ్యలు చేస్తే దాడులు తప్పవని హెచ్చరించారు.
తమపై దాడి చేసిన గుండాలను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాల్గౌడ్, టీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గుండుమల్ల పాండుగౌడ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ రాజు, ఎల్బీనగర్ టీఆర్ఎస్వీ అధ్యక్షుడు ఎం.డి. షఫీ, నాయకులు బొగ్గారపు వరుణ్చంద్ర, శివప్రకాష్, రమాకాంత్, అక్షయ్, పులికంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.