కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్తాపూర్ చెందిన శ్రీనివాస్, సోను, రాజు, పాండు గుల్బర్గాకు ఇండికా కారులో బయలు దేరారు. ఈ క్రమంలో మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారు చేరుకుంటున్న సమయంలో కారులోంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. కారులో ప్రయాణిస్తున్న పాండు గమనించి కారులో ప్రయాణిస్తున్న వారిని క్రిందకు దింపాడు.
అంతలో కారులో పెద్దగా మంటలు చెలరేగడంతో వారు కారు దిగి దూరంగా పరిగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. షాట్ సర్క్య్ట్తోనే మంటలు చేలరేగడం జరిగియాని ఎస్ఐ తెలిపారు. సంఘటనకు సంబంధించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.