కరీంనగర్ జిల్లా నాయకులకు 10 డివిజన్ల ప్రచార బాధ్యతలు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
హన్మకొండ, ఏప్రిల్ 19 : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, వొడితల సతీశ్కుమార్, సుంకె రవికుమార్తో పాటు పలువురు జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ నాయకులకు గ్రేటర్లోని 10 డివిజన్ల ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సోమవారం హన్మకొండలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో వినోద్కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నాయకులు విధిగా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని వినోద్కుమార్ సూచించారు. ప్రచారంలో మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని ఆయన కోరారు.
కరోనా నివారణ చర్యలు చేపట్టండి
వరంగల్ చౌరస్తా : వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ పరిధిలో కరోనా నివారణ చర్యలను చేపట్టాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూద న్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను ఆదేశించా రు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, టెస్టులు చేయాలని సూచించారు. అలాగే బాధితులను గుర్తించి తగిన వైద్యసేవలందించాలని ఆయన కోరారు. ఈమేరకు కార్యచరణ చేపట్టి, బాధితులను గుర్తించడంతో పాటు ఐసొ లేషన్లో ఉండేందుకు అవసరమైన మందులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
యురోపియన్ ఫుట్బాల్లో ప్రకంపనలు.. కొత్త లీగ్కు సై అన్న ఆరు క్లబ్లు
ఒప్పో నుంచి A-సిరీస్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్