గ్వాలియర్: ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ప్రేమజంటను ఢిల్లీలో కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్లో హత్య చేసి శవాలను వేరువేరు రాష్ర్టాల్లో పారేసిన ఘోరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ యూపీ ఫిరోజాబాద్ జిల్లా జహంగీర్పూర్కు చెందినవారు. హంతకులు యువకుని శవాన్ని రాజస్థాన్లో, యువతి శవాన్ని ఎంపీలోనే పారేసి వెళ్లిపోయారు. యువతికి ఇంకా మైనారిటీ తీరలేదని యూపీ పోలీసులు తెలిపారు. చివరకు ఇవి పరువు హత్యలుగా తేలాయి. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు గత జూలై 31న పారిపోయారు. వారు ఢిల్లీలో ఉన్నట్టు తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసి మధ్యప్రదేశ్లోని భిండ్కు, అక్కడి నుంచి గ్వాలియర్కు తీసుకువెళ్లారు. మధ్యదారిలోనే యువకుడిని పొడిచి చంపారు. మర్మాంగాలను కోసేశారు. అమ్మాయిని తాడుతో గొంతు నులిమి చంపేశారు. దోల్పూర్ ప్రాంతంలో రాజస్థాన్ పోలీసులు ఆమె శవాన్ని కనుగొన్నారు. ఆగస్టు 5న యువకుని శవం రాజస్థాన్ పోలీసులకు దొరికింది. యువకుని తండ్రి ఆగస్టు 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత యువతి శవం కూడా దొరుకడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులను పిలిచి ప్రశ్నిస్తే పరువుకోసం ఇద్దరినీ తామే చంపేసినట్టు అంగీకరించారు.