శ్రీనగర్: ఒక వ్యక్తి పబ్లిక్ హ్యాండ్ పంప్ ఉన్న స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించాడు. ఆ చేతి పంపు అతడి వంట గదిలోకి చేరింది. దీంతో దానిని అతడు ప్రైవేట్గా ఉపయోగించుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జమ్ముకశ్మీర్లో తాగు నీటి కోసం ఇబ్బంది పడే కిష్త్వార్ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
ఎస్ఎస్పీ కార్యాలయం సమీపంలోని ప్రజా చేతి పంపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని శీతల్ కుమార్ అనే వ్యక్తి ఆక్రమించాడు. ఆ పంపు చుట్టూ ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ చేతి పంపు అతడి వంట గదిలోకి చేరింది. ఆ పబ్లిక్ హ్యాండ్ పంప్ను అతడు వ్యక్తిగతంగా వినియోగిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో పరిసర ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. జలశక్తి అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ శాఖ అధికారులు ప్రజా చేతి పంపుతోపాటు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన శీతల్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చూసి ఆశ్చర్యపోయిన అధికారులు అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.