జైపూర్: కరోనా పరీక్షలో నెగిటివ్ వచ్చినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు బాగా పెరుగుతుండటంతో రైలు, విమానాల్లో ప్రయాణించేవారికి చాలా రాష్ట్రాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ను సమర్పిస్తేనే తమ రాష్ట్రాలకు వచ్చేందుకు అనుమతిస్తామని నిబంధనల్లో పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఇద్దరు కరోనా నెగిటివ్ పేరుతో నకిలీ రిపోర్టులు సృష్టిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో బుధవారం వారిద్దరిని అరెస్ట్ చేశారు. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ను ఫోర్జరీ చేసి ఫేక్ రిపోర్టులు తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇందులో ఏదైనా డయాగ్నస్టిక్ ల్యాబ్ ప్రమేయం ఉందా అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.