జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండల పరిషత్ ప్రెసిడెంట్ మ్యాదరి వనిత(40) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆమె ఇటీవలే కొవిడ్-19 నుంచి కోలుకున్నారు. జగిత్యాల సమీపంలోని దరూర్ ఇంటిలో ఈ ఉదయం 4.30 గంటలకు గుండెపోటుకు గురైయ్యారు. ఇంట్లోనే మృతిచెందారు. ఎంపీపీ మృతిపట్ల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దేవ వసంత్, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డితో పాటు పలువురు సంతాపం తెలిపారు.