మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 వేల నగదు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం టౌన్ పోలీస్స్టేషన్లో ఐసీఎల్ బెట్టింగ్కు పాల్పడిన వారి వివరాలను టౌన్ సీఐ జూపల్లి వెంకటరత్నం వెల్లడించారు.
ఐపీఎల్ సాగుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన నీలకుర్తి దినేశ్, కృష్ణకాలనీకి చెందిన నూనావత్ రామకృష్ణ, మెతుకు కుమార్, తోట వినయ్, కంకరబోడ్ కాలనీకి చెందిన తాటిపాముల అనిల్, గొర్రె ఓంప్రకాశ్, మూడు కొట్ల సెంటర్కు చెందిన చింతల రమేశ్ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం అందుకున్న సీసీఎస్, టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 70 వేలు, ఏడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, గేమింగ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. సమావేశంలో సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్రావు, టాస్క్ఫోర్స్ ఎస్సై రామారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Crime news |కుంటలో పడి యువకుడు మృతి
టీమిండియాకు విదేశీ కోచ్.. చాన్సే లేదంటున్న బీసీసీఐ!
వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్.. 550 కేక్స్ కట్ చేసిన వ్యక్తి