కలెక్టర్ కె.శశాంక
మారెట్ల నిర్మాణాలు, కొవిడ్ నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్స్
కార్పొరేషన్, ఏప్రిల్ 30: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ప్రతిపాదించిన స్థలాల్లో శాకాహార, మాంసాహార సమీకృత మారెట్ల నిర్మాణానికి వెంటనే బడ్జెట్ అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ కె.శశాంక సూచించారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో శాకాహార, మాంసాహార మారెట్ల నిర్మాణాలు, కొవిడ్ నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. మారెట్ల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించి బడ్జెట్ అంచనాలను తయారు చేయాలన్నారు. అంచనాలకు శనివారంలోగా సాంకేతిక అనుమతులు మంజూరు చేయాలని ప్రజారోగ్యశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లో మారెట్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులను వెంటనే మంజూరు చేస్తామని తెలిపారు. అనుమతులు పొందిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. పనులను అదనపు కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు.
హుజూరాబాద్లో ఎస్సారెస్పీ స్థలంలో సమీకృత మారెట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో అదనంగా అవసరమున్న వైకుంఠధామాల నిర్మాణాలు, ముస్లిం, మైనార్టీల గ్రేవ్యార్డ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఆదేశించారు. ఇంతవరకు కొనసాగుతున్న శ్మశాన వాటికల అభివృద్ధికి సంబంధించి స్థలాలు, అంచనాలు, డిజైన్లతో ప్రతిపాదనలు ఫొటోలతో పంపించాలన్నారు. కరీంనగర్లోని కిసాన్నగర్లో గల వ్యవసాయ మారెట్ యార్డ్ పరిధిలో సమీకృత మారెట్ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి అందించాలని ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ను ఆదేశించారు.
శానిటేషన్ డ్రైవ్ కొనసాగించాలి
పట్టణాలు, నగరాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను కొనసాగించాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీలను శుభ్ర పరచాలని, చెత్తను ప్రతిరోజూ డంప్యార్డుకు తరలించాలన్నారు. మున్సిపల్ సిబ్బందిలో ఎవరికైనా కరోనా వచ్చి ఐసొలేషన్లో ఉంటే వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సాయం అందించాలన్నారు. కరోనా సోకిన సిబ్బంది కుటుంబ సభ్యులందరికీ వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. వ్యాక్సినేషన్, కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శానిటేషన్ వరర్లకు మాసులు, శానిటైజర్లను క్రమంగా అందించాలన్నారు.
వేసవి దృష్ట్యా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. హుజూరాబాద్ అర్బన్ మిషన్ భగీరథ పథకం పనులను మే 15లోగా పూర్తి చేసి మూడు జోన్లలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొకలు ఎండిపోకుండా నీటిని అందించాలన్నారు. నర్సరీల్లో హరితహారంలో నాటేందుకు అవసరమైన మొకలను పెంచాలన్నారు. నర్సరీల్లో మొకలు తకువగా ఉంటే అటవీశాఖ లేదా ఇతర శాఖల నర్సరీల నుంచి తెప్పించుకుని పెంచాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, నగర పాలక సంస్థ కమిషనర్ క్రాంతి, ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వసంతరావు, హుజూరాబా ద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్లు ప్రసన్నరాణి, రషీద్, అంజ య్య, వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.