సిద్దిపేట: జిల్లాలోని కొహెడలో విషాదం చోటుచేసుకుంది. కొహెడ మండలంలోని తంగళ్లపల్లిలో అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగడంతో వృద్ధ దంపతులు సజీవదహనం అయ్యారు. తంగళ్లపల్లికి చెందిన యాద నర్సయ్య (80), లచ్చమ్మ (70) భార్యాభర్తలు. నిన్న రాత్రి వారు ఇంట్లో నిద్రిస్తుండగా షార్ట్ సర్య్కూట్ అయ్యింది. దీంతో మంటలు అంటుకోవడంతో వారి పూరిగుడిసె పూర్తిగా దగ్ధమయ్యింది. వారిద్దరు కూడా అగ్ని ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..