మణికొండ : జనవాసాల మధ్యలో ఇటీవల విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన 11కేవీ హైటెన్షన్ వైర్లకు తగిలి ఓ వ్యక్తి విద్యుత్షాక్కు గురైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ లాలమ్మగార్డెన్స్లో బుధవారం చోటుచేసుకుంది. ప్రధానరోడ్డు పక్క నుంచి వేయాల్సిన 11కేవీ విద్యుత్ కనెక్షన్ వైర్లను జనవాసాల మధ్యలో ఏర్పాటు చేశారు. ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. కాగా బుధవారం మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ నేత బుద్దోలు బాబు కుమారుడు ప్రకాష్ ఇంటిపక్కన ఆడుకుంటుండగా అతని కుడిచేతికి విద్యుత్తీగ తగిలింది. ఈ ప్రమాదం లో చేయి భాగం అంతా కాలిపోయింది. కొంత సమయం గడిస్తే ప్రాణనష్టమే జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.