మిట్ట మధ్యాహ్నం.. ఎండ మండిపోతున్న వేళ..“రోడ్డుకు వెళ్లి పెరుగు తీసుకురండి” అంటూ మా ఆవిడ ఆర్డర్.విసుక్కుంటూనే బయలుదేరాను. నడిచి వెళ్తున్న నన్ను హఠాత్తుగా ఎవరో ఆపినట్టు అనిపించింది.బక్కచిక్కి, సత్తువ తగ్గి నీరసంగా నడిచి వస్తున్న వ్యక్తిని చూడగానే.. ఏదో గుర్తుకు వచ్చినట్టు ఆగిపోయాను.‘ధర్మయ్యలా ఉందే! అవును వాడే.. ఇక్కడే ఉంటున్నాడా?’ కాసింత ఆశ్చర్యం.దగ్గరకు రాగానే భుజం పట్టి ఆపాను. నావంక తేరిపార జూశాడు. కాసేపటికి గుర్తుకు వచ్చినట్టు “ఒరేయ్.. సుబ్బూ” అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
ధర్మయ్య, నేను సమకాలికులం. ఊరి బడిలో కలిసి చదువుకున్నాం. కాలం కలిసి వచ్చింది. నేను సర్కారు ఉద్యోగిని అయ్యాను. ధర్మయ్యకు చదువు అబ్బలేదు. మట్టిమనిషిగా ఊర్లోనే మిగిలిపోయాడు. ఎప్పుడు ఊరెళ్లినా తప్పక కలిసేవాడిని. ఐదారేండ్ల క్రితం నుంచి సాధ్యం కాలేదు. ‘పనులు వెతుక్కుంటూ పట్నం వెళ్లిపోయాడు’ అని చెప్పారు. ‘ఎక్కడికంటే?’.. ఎవరూ చెప్పలేకపోయారు. నేనూ నా పనుల్లో పడి మర్చిపోయాను. మళ్లీ ఇన్నాళ్లకు కనిపించాడు. వాడి దీనావస్థ చూసి ఆశ్చర్యపోయాను. ఒంటిమీద సరైన బట్టలు లేవు. గొప్పింటి బిడ్డ కాకపోయినా కడుపునిండా తిండి, కట్టుకునేందుకు బట్టకు లోటు లేని కుటుంబం. నాకు కండ్లవెంట నీళ్లు తిరిగాయి.
https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=3301932544&pi=t.aa~a.3299940303~i.5~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615125693&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142957&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKYqPMI-YJQG7gUhbYW3RYYjaXVm7rbJSZujRzny9FUuLxsp9UsxOSccWg8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615125692920&bpp=6&bdt=3279&idt=-M&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd-227991314ac60071%3AT%3D1615125749%3ART%3D1615125749%3AS%3DALNI_Manw_2vO1Go5nbnfb1Naq_2umj6mw&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0&nras=2&correlator=4715818236418&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=954079822&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=1724&biw=1263&bih=824&scr_x=0&scr_y=400&eid=44736376%2C21066922%2C21068083%2C21068495%2C21068945&oid=3&pvsid=4158406433608383&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=9&uci=a!9&btvi=2&fsb=1&xpc=J9M91PTT7e&p=https%3A//www.ntnews.com&dtd=228
ధర్మయ్య కుటుంబానిది కష్టాన్ని నమ్ముకునే మనస్తత్వం. అతని తండ్రి మా పొలాన్నే కౌలుకు తీసుకుని పండించేవాడు. నిజాయితీపరుడని నాన్న చెప్పేవారు. రెక్కల కష్టంతోనే కాలక్రమంలో ఓ రెండెకరాల భూమిని సొంతంగా కొనుక్కోగలిగాడు. తండ్రి కాలం చేశాక ధర్మయ్య కూడా అతని మార్గాన్నే నమ్ముకున్నాడు. అందుకే.. ఇప్పుడలా చూడగానే అమితాశ్చర్యానికి లోనయ్యాను.“అలా నీడలోకి వెళ్లి మాట్లాడుకుందాం రా” అంటూ ఓ బహుళ అంతస్తుల భవనం పక్కకు తీసుకువెళ్లాను.“నువ్వేంటిరా ఇక్కడ.. ఇలా?” అని ప్రశ్నించా. శూన్యంలోకి చూశాడు.
“నాయనా! వద్దురా.. నా మాటిను. భూమిని నమ్ముకోవాలి. అమ్ముకోకూడదు. నేల తల్లి బీడు వారితే ఊరికే అరిష్టం” ధర్మయ్య కొడుకును మందలించాడు.సూరీడు చిరాగ్గా చూశాడు. “ఎంత చెప్పినా నీ చాదస్తం నీదేనా. అమ్మినోళ్లంతా అమాయకులా” తండ్రిపై గయ్యిమన్నాడు.“ఒకరితో పోలికెందుకురా. భూమి బంగారు బాతులాంటిది. రోజుకో గుడ్డుకోసం వేచిచూసే ఓపిక ఉండాలి. కడుపుకోసి మొత్తం తీసుకుందామన్న దురాశ వద్దు. అనుభవంతో చెబుతున్నాను. నా మాటిను. ఆ సైతానుగాడి మాయలో పడకు. భూమి బేరం పెట్టకు” ధర్మయ్య కొడుకును ప్రాధేయపడుతున్నాడు.
“ఎహేయ్.. నసపెట్టకు. ధర వచ్చినప్పుడు అమ్మకపోతే ఆ తర్వాత బాధ పడాలి. లక్ష రూపాయలు కూడా పలకని ఎకరానికి రెట్టింపు ఇస్తానంటున్నాడు. తీసుకోవడానికి నొప్పా. చుట్టూ ఉన్న భూములు అమ్మేస్తున్నారు. మధ్యలో మనమేం వ్యవసాయం చేస్తాం” తండ్రిపై సూరీడు చిరాకు పడ్డాడు.
ధర్మయ్య మంచం పైనుంచి లేచే ప్రయత్నం చేశాడు. లేవలేకపోయాడు. వారం రోజుల నుంచీ జ్వరం. మంచం పట్టాడు. ఈ లోగా కొడుకు భూమి బేరం పెట్టాడు. చెప్పినా వినేలా లేడు. కొడుక్కు నచ్చజెప్పేందుకు తల్లి లేదు. ఐదేండ్ల క్రితమే కాలం చేసింది.
మొగుడి ఎదుట మాట్లాడాలంటేనే వాడి పెళ్లానికి భయం. మూర్ఖుడు.. మీదపడిపోతాడని. ‘భగవంతుడా! నాకేది దారి’ ధర్మయ్య కన్నీటి పర్యంతమవుతున్నాడు.
‘ఒక్కగానొక్క కొడుకు. ఉన్న భూమి పోతే వాడి భవిష్యత్తు ఏమిటో? వీడికి ఈ పాడు ఆలోచన ఎందుకు వచ్చిందో? ఎవరు ఉసిగొలిపారో?’ ధర్మయ్యకు బెంగ పట్టుకుంది.
తండ్రి వేదనను పట్టించుకునే స్థితిలో లేడు సూరి. కండ్లముందు లక్షల నోట్ల కట్టలు మెదులుతున్నాయి. అగ్రిమెంట్పై తండ్రి వేలిముద్ర బలవంతంగా వేయించి వెళ్లిపోయాడు. ధర్మయ్య కొడుకువైపు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=1868815166&pi=t.aa~a.3299940303~i.12~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615125693&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142957&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKYqPMI-YJQG7gUhbYW3RYYjaXVm7rbJSZujRzny9FUuLxsp9UsxOSccWg8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615125692920&bpp=4&bdt=3279&idt=4&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd-227991314ac60071%3AT%3D1615125749%3ART%3D1615125749%3AS%3DALNI_Manw_2vO1Go5nbnfb1Naq_2umj6mw&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0%2C600x280&nras=3&correlator=4715818236418&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=954079822&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=2980&biw=1263&bih=824&scr_x=0&scr_y=400&eid=44736376%2C21066922%2C21068083%2C21068495%2C21068945&oid=3&pvsid=4158406433608383&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=10&uci=a!a&btvi=3&fsb=1&xpc=j3uZes8QyN&p=https%3A//www.ntnews.com&dtd=260
సుబ్రహ్మణ్యం కలవడంతో ఆ సంగతిని గుర్తు చేసుకుని ఏడ్చేశాడు ధర్మయ్య.“ఎక్కడినుంచి వచ్చాడో ఓ సైతాను. రెండు రెట్ల ధర ఆశ చూపాడు. నోట్ల కట్టలు చూసి ఒక్కొక్కరే వాడి మాయలో పడ్డారు. రెండు పంటలు పండే భూమి వాడి చేతుల్లో పెట్టారు. రెండేండ్లలో వందెకరాలు ప్లాట్లుగా మారిపోయింది. ఊరి కుర్రాళ్లకు కమీషన్ ఎరవేశాడు. వాడిచ్చే చిల్లర డబ్బులకు ఆశపడ్డారు. కొన్నాళ్లు అందరికీ అదే వ్యాపకం. ఎక్కడెక్కడి వారో వచ్చారు. వేలం వెర్రిగా ప్లాట్లు కొన్నారు. పచ్చని నేల తల్లి శ్మశానంలా మారిపోయింది. ఇప్పుడు అక్కడ రాళ్ల హద్దులు, వాటిమధ్య పిచ్చిమొక్కలు తప్ప మరేమీ లేవు” ధర్మయ్య తలదించుకునే మాట్లాడుతున్నాడు.
“పంటభూమితోపాటు ఉపాధీ పోయింది. సాగుకాలంలో మన ఊరి కూలీలు మరోవైపు చూడాల్సి వచ్చేది కాదు. లేఅవుట్లు అయ్యాక అందరికీ పని లేదు. ఆశ చావక కొందరు పక్కఊర్లకు వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. పదిమందికి పని ఉంటే వందమంది పోటీ. కష్టానికి ఫలితం లేదు. కడుపునిండా తిండి లేదు. డబ్బు చూశాక సూరీడు వ్యసనాలకు బానిసయ్యాడు. మద్యం మత్తులో ఉన్నవాడిని ఓ రోజు ప్రమాదం రూపంలో దేవుడు తీసుకుపోయాడు. కోడలు, మనవడి బాధ్యతకూడా నాపైనే పడింది. ఊరిలో బతుకు తెరువు పోయింది. ఇదిగో ఇలా పట్నంలో బతుకీడుస్తున్నాం. ఇక్కడా అంతంతే జీవితం. కాకపోతే ఏదో ఒక పని దొరుకుతుందన్న ఆశే నడిపిస్తున్నది” ఆవేదన నిండిన స్వరంతో ధర్మయ్య చెబుతున్నది వింటున్న సుబ్రహ్మణ్యం.. అంతులేని ఆవేదనకు లోనయ్యాడు.
అతనికి నోటమాట రాలేదు. ఎప్పుడో ఓసారి సొంతూరు వెళ్లి వస్తుంటాడు. ప్లాట్లుగా మారిన భూముల్ని చూసేవాడు. తనలాగే అవసరాలకు అమ్ముకున్నారనుకున్నాడు. వెనుక ఇంతటి విషాదం దాగుందని అనుకోలేదు.
ఏదో మిల్లులో కూలీకి పనిచేస్తున్నానన్నాడు ధర్మయ్య. వెంటనే జేబులోంచి ఓ వెయ్యి తీసి అతని చేతిలో పెట్టాను. ఏదైనా అవసరమైతే తనతో మాట్లాడాలని ఓ కాగితంపై నా ఫోన్ నంబర్ రాసిచ్చాను.
డబ్బు వద్దన్నాడు. ఒత్తిడి చేస్తే తీసుకున్నాడు. ఆ సందర్భంగా ఓ మాటన్నాడు.
“ఇలా ఎంతమందికి, ఎన్నాళ్లు ఇవ్వగలవు సుబ్బూ. మన ఊరివాళ్లే ఇక్కడ ఓ వందమంది ఉంటారు. అందర్నీ పోషించగలవా?”https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7119991287654999&output=html&h=280&adk=899866424&adf=4074572887&pi=t.aa~a.3299940303~i.18~rp.4&w=600&fwrn=4&fwrnh=100&lmt=1615125745&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=8663284801&psa=1&ad_type=text_image&format=600×280&url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday%2F2021-03-07-142957&flash=0&fwr=0&pra=3&rh=150&rw=600&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChEIgJCSggYQsc6G0PCe6Zb5ARIvACnpDKYqPMI-YJQG7gUhbYW3RYYjaXVm7rbJSZujRzny9FUuLxsp9UsxOSccWg8&uach=WyJXaW5kb3dzIiwiNi4xIiwieDg2IiwiIiwiODguMC40MzI0LjE5MCIsW11d&dt=1615125693082&bpp=4&bdt=3441&idt=4&shv=r20210303&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D3a288f1601d62fbd%3AT%3D1615125749%3AS%3DALNI_MYs71bbWgJNDCBCzwKFC8munc0vmg&prev_fmts=1200×200%2C300x250%2C300x250%2C160x600%2C160x600%2C0x0%2C600x280%2C600x280%2C0x0&nras=5&correlator=4715818236418&frm=20&pv=1&ga_vid=629328971.1612347956&ga_sid=1615122859&ga_hid=954079822&ga_fc=1&u_tz=330&u_his=5&u_java=0&u_h=1024&u_w=1280&u_ah=984&u_aw=1280&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=122&ady=4542&biw=1263&bih=824&scr_x=0&scr_y=1394&eid=44736376%2C21066922%2C21068083%2C21068495%2C21068945&oid=3&psts=AGkb-H9wmrmrbZKvla3m57J15mE4l2WGozcUZ5QNaMWUpf6mLc9ZqEgZCds5aspfqZw_fgosIgn7VvBdMzE4%2CAGkb-H_u0MZYzPVLDoFGxW1oFQXPzCEqiVjZzmNoUR1gN0iWq0_grwrfR1T3htPGvhmsq6VIXGc4Ob4SSJRbOg%2CAGkb-H_5BUQ1Dhy9C3s-j29qCaF7VbwZ3YYUAYVyoxIQbVfG8CWvxQ9Dq8oQbesuxkvJ_t93GDEuBqsYxg0&pvsid=4158406433608383&pem=205&ref=https%3A%2F%2Fwww.ntnews.com%2Fsunday&rx=0&eae=0&fc=384&brdim=0%2C0%2C0%2C0%2C1280%2C0%2C1280%2C984%2C1280%2C824&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&jar=2021-03-07-13&ifi=11&uci=a!b&btvi=4&fsb=1&xpc=NT7lkt7e9O&p=https%3A//www.ntnews.com&dtd=52624
ధర్మయ్య ప్రశ్నకు అవాక్కయ్యాను. ఎవరో చెంప చెళ్లు మనిపించినట్టయింది.
అక్కడికి వారం తర్వాత రెండు రోజులు సెలవు పెట్టి సొంతూరుకు వెళ్లాను. నిజమే! ఊరి చుట్టూ శ్మశానంలా ఉంది.
పొలిమేరల్లోనే విషాదం స్వాగతం పలికినట్టయింది. అప్పటికే ఆ విషాదాన్ని ఎన్నోసార్లు చూసిన నా కండ్లు దాన్ని పసిగట్టలేకపోయాయి. ఊరిలో పెద్దగా వ్యాపకాలు లేవు. ఇలావచ్చి చెల్లెని చూసి, అలా వెళ్లిపోయేవాడిని. అందుకేనేమో ధర్మయ్యను కలిశాకే నేను ఈ లోకంలోకి వచ్చాననిపించింది. ఎక్కడో మెరక పొలాల్లో కనిపించే ఇటుక బట్టీలు సుబ్బయ్య పల్లం భూమిలో దర్శనమిస్తున్నాయి. ఎక్కడినుంచో వచ్చిన మేస్త్రీ ఊరివాళ్లను పెట్టుకుని ఇటుక బట్టీ నడుపుతున్నాడట.
పనిలేక, వలసపోలేక ఊర్లోనే కాళ్లీడుస్తున్న కొందరికి ఇప్పుడదే జీవనాధారమయ్యింది. శ్రమను దోచుకుంటున్నా అదే మహద్భాగ్యం అన్నట్టుంది వారి పరిస్థితి.
కనకయ్య పొలంలోని బోరుబావి మూలకు చేరింది. బోరుకోసం కట్టిన చిన్న గది కూలిపోయేలా ఉంది. గదికి ఉన్న చెక్క తలుపు పుచ్చిపోయింది. కింద భాగంలో పెద్ద ఖాళీ ఏర్పడింది. ఆ సందులోనుంచి గదిలోకి కుక్కలు వెళ్లి వస్తున్నాయి. ఆ పక్క భూమిలోని ఓ పది ప్లాట్లను కలుపుతూ ఎవరో కాంక్రీట్ స్తంభాలు పాతి, ఇనుప కంచె వేసి ఉన్నారు. మధ్యలో అక్కడక్కడా కొబ్బరి మొక్కలు నాటారు. ఆలనాపాలనా లేదేమో వాటి ఆకులు ఎర్రగా మారి, మొక్క చనిపోయేలా కనిపిస్తున్నది.
ఊరి చివరి మర్రిచెట్టు వద్ద ఎప్పుడూ కనిపించే సత్యంనాయుడు జోడెద్దుల జాడగాని, వీరాస్వామి ఒంగోలు గిత్తలుగాని, నారాయణ దున్నపోతుల ఊసుగాని లేదు. చెట్టు మొదలుకు ఓ యాభై అడుగుల దూరంలో పొలంలోకి చొచ్చుకుపోయిన ఊడలకు వాటిని కట్టేవారు. మధ్యాహ్నం వేళ చెట్టుకింద కూర్చుని విశ్రాంతి తీసుకునే ఊరివాళ్లు వాటిని చూస్తూ ఏదో ఒక వ్యాఖ్య చేయడం, దానిపై చర్చ సాగడం నాకు తెలుసు. ‘వ్యవసాయమే లేదు. వాటిని ఉంచుకుని ఏం పెట్టి పోషించగలమని అమ్మేశారట’. ఆరా తీస్తే ఎవరో చెప్పారు.
ఖరీఫ్ సీజన్కు రెండు నెలల ముందు మొదలు, పంట ఇంటికి చేరేవరకు రైతులకు అన్ని విధాలా ఉపయోగపడే నాటుబండ్లు మాత్రం చెట్టుకింద విశ్రాంతి తీసుకున్నట్లు పడి ఉన్నాయి. వాటిని ఉపయోగించి చాలా రోజులైనట్టుంది. బండ్లపై పేడ, చెత్తాచెదారం పేరుకుపోయి ఉంది. చక్రాలు ఓ పది అంగుళాల మేర మట్టిలో కుంగి ఉన్నాయి. ఊరి మొదటివీధిలో ఉండే ధాన్యం మిల్లుకు తాళం వేసి ఉంది. సంక్రాంతికి నెలముందు ప్రారంభమయితే ఉగాదివరకు ఉదయం ఆరునుంచి రాత్రి పదిగంటల వరకు ధాన్యం పడుతూ కళకళలాడేదా మిల్లు. అలాంటి మిల్లు ఏదో పార్టీ కార్యాలయంలా మారినట్టుంది. మిల్లు కూలీలు చాలావరకు వలసపోయారు. ఉన్నవాళ్లు ఎప్పటి బియ్యం అప్పుడు ఊర్లో శెట్టి షాపులో కొనుక్కుంటున్నారట. మోతుబరులు పట్నంలోని పెద్దమిల్లులకు ధాన్యం ఇచ్చి, బదులుగా బియ్యం తెచ్చుకుంటున్నారట. వడ్లు పట్టించడం లేక మిల్లు మూతపడింది. పక్కనే ధాన్యం ఆరబోసే కాంక్రీట్ గచ్చుపై పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. విషయం తెలిశాక ఊర్లోకి వచ్చిన నాకు, వంద విషాదాలు ఒకేసారి స్వాగతం పలికిన అనుభవం కలిగింది. ఊరికి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ చూసినవాడినే. కానీ, నా కండ్లు, మనసు వాటి వెనుక ఉన్న విషాదాన్ని అప్పట్లో గుర్తించలేకపోయాయి.
కనుచూపు మేరలో లే అవుట్లే. ఒక్కరూ ఇల్లు కట్టలేదు. కొనిపడేస్తే భవిష్యత్తులో అధిక ధరకు అమ్ముకోవచ్చన్న ఆశ. ఈ దుస్థితికి అదే కారణం. నా మనసు వికలమయ్యింది. దురాశతో మనిషి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడని అనిపించింది. భారమైన మనసుతో నగరానికి చేరుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ, ‘ఏదో ఒకటి చేయాలి. కూలీల కన్నీరు తుడవాలి. వారు మళ్లీ పల్లెబాట పట్టాలి. సాధ్యమేనా? అంత సులభం కాదేమో? అయినా ప్రయత్నిస్తే’ ఈ ఆలోచన రాగానే ఓ నిర్ణయానికి వచ్చాను.
నేను రైల్వేలో మూడో తరగతి ఉద్యోగిని. ఎక్కడెక్కడో పనిచేశాను. రిటైర్మెంట్కి ఐదేండ్ల ముందు మా ఊరికి వంద కిలోమీటర్ల దూరంలోని నగరానికి బదిలీ అయ్యింది. రిటైరయ్యాక ఆ నగరంలోనే స్థిరపడిపోవాలనుకున్నాను. ఓ ఇల్లు కొనుక్కున్నాను. నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురిని ఓ ఇంటిదాన్ని చేశాను. కొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. ఖర్చు తగ్గిపోయింది. వెనకేసిన డబ్బుతో ఓ నాలుగు స్థలాలు కూడా కొన్నాను. ఉద్యోగ విరమణ తర్వాత శేషజీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలనుకున్నాను.
ఇప్పుడు నా మనసు ఊరివైపు అడుగులు వేయమంటున్నది. ‘మరో మూడు నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఊరిలో వారసత్వంగా వచ్చిన ఇల్లుంది. మరమ్మతులు చేయిస్తే నేను, నా భార్య ఉండేందుకు సరిపోతుంది. నెలకు దాదాపు ముప్పైవేల పింఛన్ అందుతుంది. పల్లెటూరిలో ఆ మొత్తం చాలా ఎక్కువ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరో రూ.50 లక్షల వరకు అందుతాయి. ఈ మొత్తంతో ఏదైనా చేయగలిగితే..’ అలా అనుకోగానే రకరకాల ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. చాలావాటితో ప్రయోజనం అంతంతే అనిపించింది. తాత్కాలికమేనని భావించాను. చాలాసేపు ఆలోచించాక ఓ నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే సరైన మార్గమని తోచింది. ఉదయాన్నే సొంతూరులో ఉన్న బావమరిదికి ఫోన్ చేశాను.
సుబ్రహ్మణ్యం చెప్పింది విన్నాక, గోపాలానికి బుర్ర తిరిగిపోయింది.
“మా బావకు వయసుతోపాటు చాదస్తం ఎక్కువైనట్టుంది. కొంపదీసి పిచ్చి పట్టలేదు కదా! లేకపోతే ఈ ఆలోచనలేంటి. రిటైరయ్యాక ఎవడైనా ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు. ఈయనేంటి.. ఈ వయసులో లేనిపోనివి మెడకు చుట్టుకుంటున్నాడు” చిరాకు పడుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
దూరం నుంచి మొగుడిని గమనిస్తున్నది గోపాలం భార్య విశాలాక్షి.
‘అసలేమయ్యుంటుంది’.. అని ఆమె ఆలోచనలో పడింది.
“ఏమయ్యింది.. ఉదయాన్నే మా అన్నను ఆడిపోసుకుంటున్నావు” మొగుడి తీరు చూసి వ్యంగ్యంగా అన్నది.
గోపాలం ఆమెవైపు చిరాగ్గా చూశాడు.
“ఎందుకలా టెన్షన్ పడిపోతావు. విషయం చెప్పు” మొగుడివైపు చూస్తూ అంది విశాలాక్షి.
బావ చెప్పిన విషయాన్ని భార్యకు వివరించాడు గోపాలం. అది విన్నాక విశాలాక్షి కూడా ఆశ్చర్యపోయింది. కాసేపు నోట మాట రాలేదు.
“ఇప్పుడర్థమయ్యిందా మీ అన్నకు పిచ్చి పట్టినట్టుందని ఎందుకన్నానో?” అన్నాడు కసిగా.
“ఇదిగో వంకర టింకరగా మాట్లాడకు. నోరు పారేసుకోకు. మా అన్న బాగా ఆలోచించిగానీ ఏ నిర్ణయానికీ రాడు. వాడి నిర్ణయాలను తప్పుపట్టేంత సీను నీకు లేదు. సాయంత్రం మా అన్నతో మాట్లాడుతాను. అప్పటి వరకు నిమ్మళంగా ఉండు” గయ్యిమంది విశాలాక్షి.
‘అన్నకు తగ్గ చెల్లెలు’.. అనుకుంటూ విసురుగా బయటకు వెళ్లిపోయాడు గోపాలం.
సుబ్రహ్మణ్యానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన పదెకరాల భూమి ఉండేది. కూతురి పెండ్లి సమయంలో బేరం పెట్టాడు. ఊళ్లో వాళ్లే కొనుక్కున్నారు. ఆ తర్వాత వాళ్లూ అమ్మేశారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వారి పరమైంది. పచ్చని పైరుతో కళకళలాడాల్సిన భూమి, బీడులా మారింది. ఎప్పుడు ఆ భూమి మీదుగా వెళ్లినా విశాలాక్షి మనసు గాయపడేది. అన్న వచ్చినప్పుడల్లా ఇదే మాట అనేది. ‘ఏం చేస్తాం. మనకు ప్రాప్తం లేదు’ అనేవాడు.
‘కొడుకు చేతికొచ్చాక అన్న బాగానే వెనకేసాడంటారు. కానీ, ఎప్పుడూ ఊరివైపు చూడలేదు. మరిప్పుడెందుకీ ఆలోచన’ విశాలాక్షికి ఏమీ అర్థం కాలేదు.
సాయంత్రం అన్నతో మాట్లాడింది. సుబ్రహ్మణ్యం చెప్పిన విషయం వినగానే ఆమె మనసుపై పన్నీరు చిలుకరించినట్టయింది.
‘నిజమే కొందరి డబ్బుపిచ్చికి పచ్చని నేలతల్లి బీడువారింది. ఊరివాళ్లకే పనుల్లేని దుస్థితి తెచ్చిపెట్టారు. అన్న నిర్ణయం వల్లయినా మంచి జరిగితే అదే చాలు. కానీ, జరుగుతుందా?’ విశాలాక్షిలో ఏదో అనుమానం. అన్న విజయం సాధించాలని మనసులోనే కోరుకుంది.
గోపాలం ద్వారా విషయం ఊరంతా పాకింది. తలో రకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రెండు మూడు రోజులపాటు రాత్రి రచ్చబండ వద్ద ఇదే కాలక్షేపం. వ్యంగ్యాలు, విమర్శలు, ఊహాగానాలు, పెడర్థాలు.
సుబ్రహ్మణ్యం అసలు ఉద్దేశాన్ని మాత్రం వారెవరూ గ్రహించలేకపోయారు.
బావ చెప్పాక గోపాలం ఊర్లో నలుగురైదుగురి వద్ద విషయం ప్రస్తావించాడు. ఒకరిద్దరు పెదవి విరిచారు. ‘అది సాధ్యం కాని పని’ అన్నారు. మరో ముగ్గురు ‘కష్టమే అయినా ప్రయత్నిస్తాం’ అని చెప్పారు. వారం తర్వాత ముగ్గురూ జట్టుగా వచ్చారు.
“మొత్తం వ్యవహారం మాకు వదిలేయండి. నెలరోజుల్లో సెటిల్ చేస్తాం” అన్నారు.
గోపాలం ఆశ్చర్యపోయాడు. పని పూర్తయ్యేసరికి తలప్రాణం తోకకు వస్తుందనుకున్నాడు. వారి మాటలు వింటే రెండు నెలల్లోనే వ్యవహారం తేలిపోయేలా ఉంది. అతనికి చాలా సంతోషం అనిపించింది.
‘బావ దగ్గర మాట దక్కుతుంది. అది చాలు’ పెద్ద భారం దిగినట్టు ఫీలయ్యాడు గోపాలం.
అక్కడికి వారంరోజుల తర్వాత వీరబాబు నుంచి పిలుపొచ్చింది.
‘విషయం తెలిసుంటుంది. వివరాల కోసం పిలుస్తున్నాడు’ అనుకున్నాడు గోపాలం.
వీరబాబు గ్రామ మాజీ సర్పంచ్. ముప్పై ఏండ్లనుండి సర్పంచ్గిరీ ఆ కుటుంబానిదే. రేపు ఎన్నికలైతే మళ్లీ అతనే ప్రెసిడెంట్.
‘లిటిగెంట్’ అన్న పేరుంది.
సుబ్రహ్మణ్యం ప్రయత్నంపై ఊరిలో పెద్ద చర్చే నడిచింది. వీరబాబుకూడా ఆశ్చర్యపోయాడు. తర్వాత అనుమానం మొదలైంది.
‘అప్పుడు అవసరానికి భూమి అమ్మేశాడు. ఇప్పుడెందుకు పునరాలోచన చేస్తున్నట్టు’ వీరబాబు తత్వమే అంత. ఎవరినీ ఓ పట్టాన నమ్మడు. ఏ అవకాశాన్నీ ఇతరులకు వదులుకునేంత పెద్ద మనసూ లేదు.
‘వాడసలే పట్నంలో పదిమందితో పరిచయాలున్నోడు. ఇప్పుడీ ఆలోచన చేస్తున్నాడంటే ఏదో మతలబు ఉండే ఉంటుంది. వాడిని తక్కువగా అంచనా వేయకూడదు’ వీరబాబు తనలో తానే తర్కించుకుంటున్నాడు.
సుబ్రహ్మణ్యం రాకను రాజకీయ కోణంలోనూ చూస్తున్నాడు. ఊర్లో తనతో సమానంగా బంధుగణం ఉన్నోడు. కొడుకు విదేశాల్లో స్థిరపడ్డాడు. బాగా సంపాదిస్తున్నాడు. అల్లుడిది మంచి పరపతి ఉన్న ఉద్యోగం. భవిష్యత్తులో ఏ రూపంలోనైనా పోటీ కావచ్చు. అదీ అతని భయం. అందుకే ఏదోలా మోకాలడ్డే ప్రయత్నాలు మొదలెట్టాడు.
పిలిచాక వెళ్లకపోతే బాగోదని వీరబాబు ఇంటికి వెళ్లాడు గోపాలం. వసారాలో కూర్చున్న వీరబాబు అతన్ని చూడగానే ఆప్యాయంగా పలుకరించాడు. ముఖంలో నవ్వు పులుముకున్నాడు.
విషయం తెలియనట్టు మాట్లాడాడు. చిన్న హెచ్చరికలాంటి హింటిచ్చాడు.
“మా బావకు మన ఊరంటే ప్రాణం వీరబాబు. ఇక్కడైతే అంతా మనవాళ్లుంటారని ఎప్పుడూ అనేవాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు సాధ్యం కాలేదు. రిటైరవుతున్నాడు కదా. సొంతూరుకి వచ్చేద్దామనుకుంటున్నాడు. ఏదో వ్యాపకం పెట్టుకోవాలి కదా. అందుకే ఎంతో కొంత భూమిని కొనమన్నాడు. ఆ పని చేసిపెట్టమని మనోళ్లకు పురమాయించాను అంతే” నింపాదిగానే చెప్పాడు గోపాలం.
తాను చెప్పింది వీరబాబు నమ్మడని తెలిసినా ఏదో ఒకటి చెప్పాలని చెప్పాడంతే.
‘బావా, బావమరుదులు ఇద్దరూ ఘటికులే. భూమి కొనమని చెప్పాడంటున్నాడు. కానీ, తాను అమ్మేసిన భూమే కొనమన్నాడని చెప్పడం లేదు. ఇక్కడే ఏదో మతలబు ఉంది’.. మనసులోనే అనుకున్నాడు వీరబాబు.
“సరేలే గోపాలం! మనోడు మనూరికి వస్తున్నాడంటే నాకూ ఆనందం కాదా. నా అవసరం ఏదైనా పడితే మొహమాట పడకు. మనోడికి సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాను” నాటకీయంగా మాట్లాడుతూ ‘ఇక వెళ్లిరా’ అన్నట్లు కుర్చీలోంచి లేచాడు.
సుబ్రహ్మణ్యం కొనాలనుకుంటున్న భూమిలో ప్లాట్లున్న యజమానులతో వారం తర్వాత వీరబాబు ఊర్లో సమావేశం ఏర్పాటు చేశాడు.
“మీటింగ్ ఉంది. మీ బావను కూడా రమ్మను” అంటూ గోపాలానికి కబురుపెట్టాడు.
ఏదో పితలాటకానికే పిలుస్తున్నాడని గోపాలం అనుమానించాడు. విషయం సుబ్రహ్మణ్యానికి చెప్పాడు.
“కంగారు పడకు, నేను చూసుకుంటా” అని సుబ్రహ్మణ్యం ధైర్యం చెప్పాడు.
అనుకున్న రోజు వీరబాబు చావిడీలో మీటింగ్ మొదలయ్యింది. యాభై శాతం మంది ప్లాట్ ఓనర్లు వచ్చారు. మిగిలిన వారుకూడా ‘అందరి నిర్ణయమే మా నిర్ణయం’ అంటూ మధ్యవర్తులకు సమాచారం పంపించారు. అక్కడ ఎవరిలోనూ ఆ డీల్పై వ్యతిరేకత లేదు. ఏదోలా సెటిల్మెంట్ అయిపోవాలని కోరుకుంటున్నారు. ఏదో ఒక రాద్ధాంతం చేయాలని చూస్తున్నది వీరబాబు మాత్రమే.
ఎదురుగా ఉన్న కుర్చీలో వీరబాబు కూర్చున్నాడు. కాస్త దూరంగా సుబ్రహ్మణ్యం, గోపాలం కూర్చున్నారు. అప్పటికే ఐదారుసార్లు లేచి ప్యాంటు సర్దుకున్నాడు. అటూ ఇటూ తిరిగాడు. కాసేపు తలపంకించాడు. లేనిపోని చిల్లర చేష్టలన్నీ చేస్తున్నాడు.
వీరబాబు తీరుచూసి అక్కడి వారు చిరాకు పడుతున్నారు.
“బావా ఎందుకు అలా కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మన వీరబాబు” ఊరిలో వరసైన వీరేసు పక్కనే ఉన్న ఈరేసుతో అన్నాడు.
“బుర్రకేదీ తోచనప్పుడు వాడు అలాగే బిల్డప్ ఇస్తాడురా. మనకేం బోయింది. నలుగురితో నారాయణ” అన్నాడు ఈరేసు.
‘సెటిల్మెంట్ త్వరగా తేలిపోతే బాగుండు’ అని కోరుకుంటున్న వారే అక్కడున్నరంతా.
‘మంచి పార్టీ వచ్చింది. కొన్నదానికి మూడు రెట్లు ధర ఇస్తామంటున్నారు. ఇప్పుడు అదే ఎక్కువ. అటువంటప్పుడు లేనిపోని ఈ పంచాయతీలు ఎందుకు’ అన్నది వారి ఉద్దేశం.
అందుకే వీరబాబు ఈ విషయాన్ని సాగదీయడం వారికి నచ్చడం లేదు. అయినా ఆ విషయం చెప్పలేకపోతున్నారు. ఏం పితలాటకం పెడతాడో అని భయం.
వీరబాబు ఈసారి సుహ్మ్రణ్యం వైపు తీక్షణంగా చూశాడు. ముఖం చిట్లించాడు. చిరాగ్గా ముఖం పెట్టాడు.
సుబ్రహ్మణ్యం అవేవీ పట్టించుకోవడం లేదు. వీరబాబును కేర్ చేస్తున్నట్టే కనిపించలేదు.
“ఏటండీ సుబ్రహ్మణ్యం గారు. ఈ పంచాయతీ ఏంటి? ప్రశాంతంగా ఉన్న ఊర్లో ఈ పితలాటకాలేంటి?”
నోరు విప్పిన వీరబాబువైపు అదోలా చూశాడు సుబ్రహ్మణ్యం. ఆ చూపునకు అర్థం ఏంటో తెలియక కాస్త జంకాడు వీరబాబు.
‘ఏం చెబుతాడా’ అని చూస్తున్నాడు.
“పంచాయతీ ఏం లేదు వీరబాబు. ప్రాధేయపడుతున్నాను. మీ నాన్న, నేను సమకాలికులం. ఆ రోజు భూమి అమ్మకానికి పెట్టినప్పుడు మీ నాన్నే పెద్దమనిషి. ఇప్పుడు లేడు. నా భూమి నాకు కావాలి. నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. ఇందులో పితలాటకం ఏముంది”
సుబ్రహ్మణ్యం నింపాదిగానే చెప్పాడు.
“ప్రాధేయపడటం అంటే ఇదా. పదేండ్ల క్రితం మీ అవసరానికి భూమి అమ్ముకున్నారు. ఇప్పుడదే భూమి నాకే అమ్మాలంటున్నారు. ఇది పితలాటకం కాదా. ఆ భూమి అమ్మాలో, వద్దో చెప్పడానికి మీరెవరు. ఇలా బలవంతం చేయొచ్చా” వీరబాబు కోపం నటిస్తున్నాడు.
“నేనూ ఈ ఊరి వాడినే వీరబాబు. ఊరిపై మమకారం పోలేదు. రిటైర్ అవుతున్నాను. సొంతూరిపై ధ్యాస కలిగింది. ఎలాగూ వచ్చేస్తున్నాను. నా భూమి నా చేతుల్లో ఉండాలనుకున్నాను. అందుకే ఈ ప్రయత్నం. ఇవ్వడానికి ఇష్టం లేకపోతే చెప్పమను. బలవంతం లేదు”
కూర్చున్న వారిలో కలకలం మొదలయ్యింది. సుబ్రహ్మణ్యం నవ్వుకున్నాడు.
‘తమలో తాము గొణుక్కుంటున్నారు తప్ప తొత్తు కొడుకులు ఒక్కడూ నోరు విప్పరేం’ మనసులోనే తిట్టుకున్నాడు వీరబాబు.
“పచ్చని పంటభూమిని నేను అమ్మాను. ఇప్పుడది శ్మశానంలా ఉంది. కొన్నవాళ్లంతా స్థలాలపై పెట్టుబడి పెట్టిన వారే. సాగుకోసం కాదు. ఇల్లు కట్టుకున్న వారూ లేరు. వారికి కావాల్సింది లాభం. ఆ లాభమేదో నేనే ఇస్తానంటున్నాను. ఇప్పుడు ఎంత ధర ఉందో అంతే చెల్లిస్తాను. కొన్నవాళ్లను నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు ఇవ్వరని అడుగడం లేదు. నా భూమిపై నాకున్న మమకారాన్ని చెప్పాను. అందరూ ఇస్తేనే నా పదెకరాలు నా స్వాధీనం అవుతుంది. మళ్లీ ఆ భూమిని నేనెలా వినియోగించుకోవాలనుకున్నా వీలవుతుంది. అంతే తప్ప పితలాటకం ఏమీ లేదు” సుబ్రహ్మణ్యం అందరివైపూ చూస్తూ అన్నాడు.
గంటపాటు అక్కడ చర్చ సాగింది. వీరబాబు ఎన్ని కొర్రీలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నా మద్దతుగా అక్కడికి వచ్చిన వారిలో ఒక్కడూ మాట్లాడలేదు. మనసులోనే అందరినీ తిట్టుకున్నాడు వీరబాబు. తన పాచిక పారేట్టు లేదనిపించింది అతనికి. అయినా.. ఏదో ఆశ. అంత ఈజీగా వదిలేయకూడదన్న మూర్ఖత్వం. అదీ ఇదని చెప్పి ఆ రోజుకి పంచాయతీ ముగించేశాడు.
ఆ తర్వాత ప్లాట్ల ఓనర్లకు ఫోన్లు చేసి మరోసారి ఎగదోశాడు.
“వద్దండి వీరబాబు గారు. ఇప్పటికే నష్టపోయాం. ఏదోలా సెటిల్ చేసేద్దురూ” అని అనడంతో గాలి తీసేసినట్టయింది.
అమాంతం భూమి ధర పెరుగుతుందని కొనేశారు. అనుకున్నట్టేమీ పెరగలేదు. బ్యాంకు వడ్డీకూడా వచ్చేలా లేదు. ఈ పరిస్థితుల్లో ఎవరో కొంటున్నారనగానే ఎగిరి గంతేశారు. ‘వచ్చిందే మహద్భాగ్యం’ అన్నట్లు ఉంది వారి పరిస్థితి. వీరబాబు మాటల్ని అందుకే వారు పట్టించుకోవడం లేదు. ప్లాట్ ఓనర్లు వినడం లేదని, మధ్యవర్తులను బెదిరించాలని చూశాడు వీరబాబు. వాళ్లూ కేర్ చేయలేదు. దీంతో లీగల్గా ఏదైనా పాయింట్ దొరుకుతుందేమోనని వెదకడం మొదలు పెట్టాడు.
అతనికి లేఅవుట్లలోని రోడ్లు గుర్తుకు వచ్చాయి. ‘నిజమే.. ప్లాట్లు కొంటాడు. మరి రోడ్లు పంచాయతీవి కదా’ ఈ ఆలోచన రాగానే వీరబాబుకు వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది. ఎగిరి గంతేశాడు. అదే విషయాన్ని గోపాలానికి చెప్పాడు.
‘గాడిద కొడుకు.. కొర్రీ కోసం చూస్తున్నాడు. అయినా మా బావ భూమి కొనుక్కుంటే వీడికి వచ్చిన బాధేమిటి. కుళ్లు నాయాల’ అంటూ మనసులోనే తిట్టుకున్నాడు గోపాలం.
“విషయం బావ దృష్టికి తీసుకువెళ్తా” అని చెప్పాడు.
గోపాలం విషయం చెప్పగానే సుబ్రహ్మణ్యం నేరుగా వీరబాబుకే ఫోన్ చేశాడు.
సుబ్బు ఫోన్ అనగానే వీరబాబుకు ఏదో సాధించేసినంత ఆనందం కలిగింది.
ఫోన్లో బింకాలకు పోయాడు.
“అవును.. కరెక్టే కదా.. అదెలా అవుద్ది. పంచాయతీ ఒప్పుకోదు కదా” అంటూ అడ్డగోలుగా మాట్లాడాడు.
“చూడు వీరబాబు.. అది ప్రైవేట్ లే అవుట్. వెంచర్ వేసినవాడు రోడ్లకు కేటాయించిన స్థలం విలువకూడా ప్లాట్ల ఓనర్ల నుంచే వసూలు చేస్తాడు. అందువల్ల రోడ్లుకూడా ప్లాట్ల ఓనర్లవే అవుతాయి. అంటే మొత్తం ప్లాట్లు ఎవరివైతే రోడ్లుకూడా వారికే చెందుతాయి. కావాలంటే తెలిసిన వాళ్లను అడుగు” సుబ్రహ్మణ్యం అటునుంచి నింపాదిగా చెప్పడంతో వీరబాబు నీరుగారిపోయాడు. చాలాసేపు లిటిగేషన్ మాటలు మాట్లాడాడు. సుబ్రహ్మణ్యం
ఏ మాత్రం దిగిరాలేదు.
“నువ్వలా వాదిస్తే నేనేం చెబుతాను సుబ్బూ. సరేలే.. రూలు ఎలా వుంటే అలాగే జరుగుతుంది” అంటూ ఫోన్ పెట్టేశాడు.
తెలిసిన లాయర్కి ఫోన్ చేశాడు. విషయం వివరించాడు. రిజిస్ట్రేషన్ నంబర్లు, సర్వే నంబర్లు చెప్పాడు. రెండురోజుల తర్వాత అతను చెప్పింది విని మరింత నిరుత్సాహ పడిపోయాడు.
“సార్.. అది ప్రైవేటు లే అవుట్. ఎవరో అనామకంగా రాళ్లు పాతేసి ప్లాట్లకింద విభజించి అమ్మేశారు. రిజిస్ట్రేషన్లన్నీ సాగుభూమి కింద జరిగివున్నాయి. ప్రభుత్వం దృష్టిలో అది ఇంకా సాగుభూమే. ఎటువంటి కొర్రీలు వేసినా ప్రయోజనం ఉండదు. విషయం తెగేవరకు లాగితే జరిగిన మోసం బయట పడుతుంది. ప్లాట్లు కొని సాగుభూమి కింద రిజిస్ట్రేషన్ చేశారని తేలుతుంది. రిజిస్ట్రార్ ఫిర్యాదు చేస్తే కేసు పీకకు చుట్టుకుంటుంది. జరిమానాతో తేలిపోతే పర్వాలేదు. అప్పట్లో సర్పంచ్గా మీ బాధ్యత ఉందని తేలితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం” ఆ మాటలు వినగానే వీరబాబుకు ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.
‘వాడు అన్నీ చూశాకే పితలాటకం పెట్టాడు. ఎంతయినా పట్నంలో తిరిగిన బుర్రకదా’ వీరబాబు కుతకుతలాడిపోయాడు.
‘ఇక తానేమీ చేయగలిగింది లేదు. రాజీ పడి ఎంతోకొంత దక్కించుకోవడమే బెటర్. కాకపోతే అలా కనిపించకూడదు. లోకువైపోతాను. తానే వ్యవహారం సెటిల్ చేసినట్టుండాలి’.
ఈ ఆలోచన రాగానే గోపాలానికి ఫోన్ చేసి కూర్చుని మాట్లాడుకుందామని చెప్పాడు.
వీరబాబు ఉద్దేశం ఏమిటో సుబ్రహ్మణ్యం, గోపాలానికి తెలుసు. తన పెద్దరికానికి ఎక్కడ ముసలం వస్తుందో అన్న భయం ఒకటి. తన చేతిలో ఏమీ పడకుండా వ్యవహారం ఎలా సెటిల్ అవుద్దన్నది రెండోది. అందుకే నాటకాలుడుతున్నాడని వారికి తెలుసు.
‘మరో పది రోజుల్లో తన రిటైర్మెంట్. అక్కడికి పక్షం రోజుల్లో చేతికి డబ్బు వస్తుంది. అప్పటిలోగా అన్ని అడ్డంకులూ తొలగించుకోవాలి. చిన్న లిటిగేషన్ వచ్చినా వీరబాబు దాన్ని పెద్దది చేస్తాడు. అతని భయం, ఆశ తెలుసు. వాడి భయాలతో మాకు పనిలేదు. ఎంతోకొంత చేతిలో పెడితే రాజీకొస్తాడు. బ్రోకర్లకు ఎలాగూ కమీషన్ ఇస్తున్నాం. వీరబాబును కూడా ఓ బ్రోకర్ అనుకుంటే సరి’.. ఈ ఆలోచన రాగానే వీరబాబు వద్దకు గోపాలాన్ని పంపించాడు సుబ్రహ్మణ్యం. విషయం విని వీరబాబు మహదానంద పడిపోయాడు.
‘పైసామే పరమాత్మ’ అని అనుకుంటూ అక్కడినుంచి వచ్చేశాడు గోపాలం.
మరో రెండు మూడు సిటింగ్లకు మొత్తం వ్యవహారం తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పదెకరాలు సుబ్రహ్మణ్యం సొంతమయ్యింది. ఈ విషయం తెలిసి చట్టుపక్కల లేఅవుట్లలోని ప్లాట్ ఓనర్లు కూడా తమ భూమి ఇచ్చేస్తామంటూ ముందుకు వచ్చారు. లెక్కేస్తే దాదాపు ఇరవై ఎకరాలు తేలింది. అంతా ఒక్కచోటుదే. ‘ఇదీ శుభసూచకమే’ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. కానీ, ‘పెద్దమొత్తం డబ్బు కావాలి. రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బు అయిపోయింది. అలాంటప్పుడు ఇంత పెద్ద ప్రయత్నం చేస్తే అత్యాశకు పోయినట్టవుద్దేమో’.. తర్జనభర్జన పడ్డాడు. ఓసారి కొడుకుతో మాట్లాడి చూద్దామని ఫోన్ చేశాడు. విషయం వివరిస్తే అతను వెనుకడుగు వేయొద్దన్నాడు. కావాలనుకుంటే లోన్ తీసుకుంటానన్నాడు. మరికొంత తాను సర్దుతానన్నాడు. సుబ్రహ్మణ్యానికి ధైర్యం వచ్చింది. నగరంలో ఉన్న నాలుగు ప్లాట్లలో రెండు ప్లాట్లు అమ్మకానికి పెట్టాడు. ప్లాట్లు అమ్మగా వచ్చిన మొత్తం, కొడుకు సమకూర్చిన దానితో వ్యవహారం సెటిలైపోయింది. మొత్తం ముప్పై ఎకరాలు సుబ్రహ్మణ్యం సొంతమయ్యింది. శ్మశానంలా మారిన భూమిలో దాదాపు మూడోవంతు చేతికి రావడంతో అతని ఆనందానికి హద్దేలేదు.
ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మొత్తం భూమిని ఐదారు కమతాలుగా మార్పించాడు. రెండు బోర్లు వేయించాడు. ఖరీఫ్ కలిసి రావడంతో నారు పోయించాడు. భూమిని నాటుకు సిద్ధం చేయించాడు. బీడుభూమి పంటభూమిగా మారిన దృశ్యం చూడగానే సుబ్రహ్మణ్యం మనసు పులకించిపోయింది. తన కల నెరవేరిందనుకున్నాడు. ఊరివాళ్లంతా సుబ్రహ్మణ్యాన్ని ఆకాశానికి ఎత్తేశారు. ఆ సమయంలో అతనికి ధర్మయ్య గుర్తుకువచ్చాడు. ‘ఇంతటి బృహత్తర ప్రయత్నానికి తన బుర్రలో చిన్న ఆలోచన వెలిగించిన వ్యక్తి ధర్మయ్య. అతని చేతులమీదుగా నాట్లు ప్రారంభించాలి’ అనుకున్నాడు. ధర్మయ్యను ఊరికి రప్పించాడు. దమ్ము మడిని చూడగానే ధర్మయ్య ముఖం వెలిగిపోయింది.
“చాలా గొప్ప పనిచేశావు సుబ్బూ” అన్నాడు.అప్పటికే నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న మహిళలు చప్పట్లు కొట్టారు.“అంతా బాగుందయ్యా.. బీడువారిన మిగిలిన భూముల సంగతి చూడండయ్యా. మా నోటికి ఇంత కూడు దొరుకుతుంది” కూలీల్లోని ఓ మహిళ అరుస్తూ చెప్పింది.సుబ్రహ్మణ్యం అది ఊహించిందే.బీడువారిన భూమిలో తాను ముప్పై ఎకరాలు సాగులోకి తేగలిగాడు. నాలాగే మరికొందరు ప్రయత్నిస్తే..
‘నేను విత్తు వేశాను. అది వృక్షం అయి తీరుతుంది’ అని మనసులోనే అనుకున్నాడు.రెండు నెలల్లో ముప్పై ఎకరాల్లో పచ్చదనం అల్లుకుంది. తివాచిలా దర్శనమిచ్చి అటు వెళ్తున్న వారికి స్వాగతం పలుకుతున్నది.
సుబ్రహ్మణ్యం ఆనందపరవశుడయ్యాడు.‘నేనో ప్రయత్నం చేశాను. ఇది తప్పక మరికొందరికి ప్రేరణ ఇస్తుంది’ అనుకున్నాడు.‘తన మనసుకు ఇప్పుడు నిజమైన విశ్రాంతి దొరికింది’ అని సంతోషించాడు.
కనుచూపు మేరలో లే అవుట్లే. ఒక్కరూ ఇల్లు కట్టలేదు. కొనిపడేస్తే భవిష్యత్తులో అధిక ధరకు అమ్ముకోవచ్చన్న ఆశ. ఈ దుస్థితికి అదే కారణం. నా మనసు వికలమయ్యింది. దురాశతో మనిషి తన సమాధిని తానే కట్టుకుంటున్నాడని అనిపించింది. భారమైన మనసుతో నగరానికి చేరుకున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ, ‘ఏదో ఒకటి చేయాలి. కూలీల కన్నీరు తుడవాలి’
పచ్చని పంటభూమిని నేను అమ్మాను. ఇప్పుడది శ్మశానంలా ఉంది. కొన్నవాళ్లంతా స్థలాలపై పెట్టుబడి పెట్టిన వారే. సాగుకోసం కాదు. ఇల్లు కట్టుకున్న వారూ లేరు. వారికి కావాల్సింది లాభం. ఆ లాభమేదో నేనే ఇస్తానంటున్నాను. ఇప్పుడు ఎంత ధర ఉందో అంతే చెల్లిస్తాను. కొన్నవాళ్లను నేను తప్పు పట్టడం లేదు. ఎందుకు ఇవ్వరని అడుగడం లేదు. నా భూమిపై నాకున్న మమకారాన్ని చెప్పాను.
ఎక్స్కవేటర్లు, ట్రాక్టర్లు పెట్టి మొత్తం భూమిని ఐదారు కమతాలుగా మార్పించాడు. రెండు బోర్లు వేయించాడు. ఖరీఫ్ కలిసి రావడంతో నారు పోయించాడు. భూమిని నాటుకు సిద్ధం చేయించాడు. బీడుభూమి పంటభూమిగా మారిన దృశ్యం చూడగానే సుబ్రహ్మణ్యం మనసు పులకించిపోయింది. తన కల నెరవేరిందనుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరానికి చెందిన బి.వి.రమణమూర్తి, ఎం.ఏ, బీఈడీ చేశారు. 1995లో అనుకోకుండానే పాత్రికేయరంగంలోకి అడుగుపెట్టారు. ఏడాదిపాటు శిక్షణ తీసుకున్న తర్వాత డెస్క్ జర్నలిస్ట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 26 ఏండ్లుగా జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. అభిరుచితో 2016 నుంచి కథలు రాయడం మొదలుపెట్టారు. ఆ ఏడాది నవ్య వారపత్రిక నిర్వహించిన కథలపోటీకి రెండు కథలను పంపించగా, రెండూ ఎంపికయ్యాయి. దీంతో, రెట్టించిన ఉత్సాహంతో కథా రచనను కొనసాగిస్తున్నారు. 2018లో రమణమూర్తి రాసిన ‘గోమాలచ్చిమి’ కథ అచ్చయింది. ఇప్పటి వరకూ వివిధ పోటీల్లో 18 కథలు బహుమతులు గెలుచుకున్నాయి. 2021లో టీబీకే బాలకృష్ణారెడ్డి కథల పోటీల్లో రెండో బహుమతి, సాలూరు సాహిత్య బృందం వారు నిర్వహించిన వ్యంగ్య కథలపోటీల్లో ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. తాజాగా, నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతి గెలుపొందారు.
సెల్: 9848987239
బి.వి.రమణమూర్తి