భోపాల్: మధ్యప్రదేశ్లో మరో అక్రమ ఆయుధ తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. దాడులు చేసిన పంజాబ్ పోలీసులు 39 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మూలాలు ఉన్న నాలుగో ఆయుధ తయారీ, సరఫరా రాకెట్ను పంజాబ్ పోలీసులు చేధించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయం తెలిపింది. గతంలో మూడు సార్లు దాడులు నిర్వహించి అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.