పుణే : కరోనా నిబంధనలను తుంగలో తొక్కి మద్యం మత్తులో అర్ధరాత్రి పార్టీలను నిర్వహిస్తున్న ఆయా క్లబ్ల యజమానులు, నిర్వాహకులను పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటుచేసిన పార్టీల్లో తప్పతాగి చిందులేసిన 40 మంది యువకులకు నోటీసులు జారీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున కొవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఉండ్రి, కొండ్వా ప్రాంతాల్లోని పలు క్లబ్లలో యువత మద్యం మత్తులో నృత్యాలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఆయా క్లబ్లపై దాడులు చేపట్టారు.
ఈ క్లబ్లలో కస్టమర్లకు హుక్కా, పైప్లను సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరో క్లబ్లో స్విమ్మింగ్ పూల్ పక్కన తప్పతాగి యువత చిందులేస్తూ పోలీసుల కంటపడ్డారు. ఈ ప్రాంతాల్లో యువత తప్పతాగి అరుపులు కేకలతో చిందులేస్తూ అసౌకర్యం కలిగిస్తున్నారని స్ధానికులు ఆరోపించారు.