శంషాబాద్ రూరల్ : కారు అగ్నిప్రమాదంలో సజీవ దహనమైన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మలక్పేట్ యశోధ దవాఖానలో ప్రముఖ వైద్యుడిగా సేవలందిస్తున్న సుధీర్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సుధీర్ హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో ఉంటూ మలక్పేట్ యశోధ దవాఖానలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు.
శనివారం రాత్రి తన కారులో ఔటర్రింగ్ రోడ్డుమీదగా ప్రకాశం జిల్లాకు వెళ్తున్న క్రమంలో శంషాబాద్ పట్టణం దాటి వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చేలరేగి అంతటా వ్యాపించాయి. సుధీర్ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో కారులోనే సజీవ దహనమయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.