ఇబ్రహీంపట్నంరూరల్ : ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కుమ్మరికుంట కాలనీకి చెందిన కోనారెడ్డి భిక్షపతి, శైలజ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తన భార్య శైలజ ఇద్దరు కుమారులు అశోక్ (2), అంకిత్ (5)ను తీసుకుని సోమవారం కెనరాబ్యాంకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెల్లింది. ఇంటి నుంచి వెళ్లిన ఆమె సాయంత్రం వరకు తిరిగి రాలేదు.
చుట్టు పక్కల, బంధువులు ఇండ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పిల్లలతో పాటు శైలజ కనిపించడం లేదని భర్త భిక్షపతి మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.