చిరుతను చంపి తిన్నారు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు

ఇడుక్కి: కేరళలో ఐదుగురు కలిసి వలలో చిక్కిన చిరుతను చంపేశారు. అనంతరం దాని మాంసం వండుకుని తిన్నారు. చిరుత చర్మం, గోర్లు, పళ్లను అమ్ముకునేందుకు దాచిపెట్టారు. అయితే, విషయం అటవీ అధికారులకు చేరడంతో కటకటాల పాలయ్యారు. కేరళలోని ఇడుక్కి జిల్లా మంకులం ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వినోద్ అనే వ్యక్తి అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే తన ఇంటి చుట్టూ అడవి జంతువుల కోసం వల ఏర్పాటు చేశాడు. ఈ నెల 20న ఆ వలలో చిరుతపులి చిక్కింది.
అయితే, వలలో చిరుత చిక్కిన విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయకుండా తన ఇరుగుపొరుగు వారైన కురియకోస్, బిను, కుంజప్పన్, విన్సెంట్లతో కలిసి వినోద్ దాన్ని చంపేశాడు. అనంతరం చిరుత తిత్తి తీసి మాంసం వండుకు తిన్నారు. పైగా అమ్ముకుంటే డబ్బులు వస్తాయన్న ఆశతో చిరుత చర్మాన్ని, గోర్లను, పళ్లను దాటిపెట్టారు. అయితే, ఇంతలో విషయం అటవీ అధికారులకు చేరడంతో వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితులను రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులు వండుకున్న తిన్న చిరుత వయసు 6-7 ఏండ్లు ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.
Kerala: Five persons were arrested for allegedly killing a leopard and consuming its meat in Idukki district.
— ANI (@ANI) January 24, 2021
(23.01.2021) pic.twitter.com/GTTyFRtzHq
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు