నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ’. వినూత్న ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. గత మూడు వారాలుగా ఇటలీలో ఈసినిమా చిత్రీకరణ జరుగుతోంది. సుదీర్ఘమైన ఈ షెడ్యూల్ను పూర్తిచేసుకొని ఇండియాకు తిరిగి రాబోతున్నట్లు ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ శుక్రవారం ప్రకటించారు. యూనిట్ సభ్యులతో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్చేశారు. కథానాయిక రాశీఖన్నా ఇటలీ షూటింగ్ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నది. సెట్లో నాగచైతన్యతో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫొటోను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాది. కరోనా భయాలు నెలకొన్నప్పటికీ ధైర్యంగా ఏప్రిల్లో ఇటలీకి చిత్రబృందం పయనమైంది. ఇటలీలోని అందమైన లొకేషన్స్లో నాగచైతన్య, రాశీఖన్నాలపై కీలక సన్నివేశాలతో పాటు పాటల్ని చిత్రీకరించారు. కరోనా వ్యాప్తితో షూటింగ్ నిలిచిపోయినట్లు వార్తలొచ్చినా చిత్రబృందం వాటిని ఖండించింది. అవాంతరాల్ని దాటుకుంటూ విజయవంతంగా షెడ్యూల్ను పూర్తిచేశారు. తదుపరి షెడ్యూల్ జూలైలో హైదరాబాద్లో ప్రారంభంకానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో రాశీఖన్నాతో పాటు మాళవికానాయర్, అవికాగోర్ కథానాయికలుగా నటిస్తున్నారు.