న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు మొండి బాకీలు ప్రధాన సమస్యగా మారిందని బజాజ్ ఫైనాన్స్ సీఈవో సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలివ్వడానికి మొండి బాకీలు ఆటంకంగా నిలిచాయన్నారు.
శుక్రవారం ఆయన టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఎకనమిక్ కాంక్లేవ్లో సంజీవ్ బజాజ్ మాట్లాడుతూ కరోనాకు ముందు రుణ పరపతి అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందన్నారు. కరోనా తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఆరు నెలల్లో ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కన్జూమర్లు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలు మంజూరు చేశాయని సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ)కు లైసెన్స్లు మంజూరు చేయడం బ్యాంకింగ్ గురించి నేర్చుకోవడానికి లైసెన్స్ అని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థకు పలు ఎన్బీఎఫ్సీలకు లైసెన్సులు ఇవ్వాల్సి ఉందని సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలకు, బ్యాంకులకు స్వల్ప తేడాలు ఉన్నాయన్నారు. ఎన్బీఎఫ్సీలు జియోగ్రాఫికల్గా పరిమితంగా ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని చెప్పారు.
మా వాదనే నిజమైంది.. సుప్రీం తీర్పుపై రతన్ టాటా!
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!