మేడ్చల్ మల్కాజిగిరి : ద్విచక్రవాహనం అదుపుతప్పి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్యకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్ గ్రామం సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద చోటు చేసుకుంది. ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు కథనం ప్రకారం..యాదాద్రి జిల్లా భువనగిరిలో నివాసం ఉంటున్న వరంగల్ జిల్లా హన్మకొండ మండలం పలివెలుపుల గ్రామానికి చెందిన కంది మహేష్(29) స్థానికంగా ప్లిఫ్కార్ట్ సంస్థలో మేనేజర్గా విధులు నిర్వహస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలో నివాసం ఉంటున్న తన మిత్రుని ఇంటికి వెళ్లేందుకు భార్య మానసతో కలిసి ద్విచక్ర వాహనం(టీఎస్02 ఇఇ4310) పై వెళ్తూ..అవుషాపూర్ గ్రామంలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలోకి చేరుకోగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న గోతిలో పడ్డారు. గోతిలో ఉన్న రాళ్లు తలకు తగిలి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
వెనుకాల కూర్చున్న భార్య మానసకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంవత్సరం జనవరి 8న దంపతులకు వివాహం జరిగినట్లు బంధువులు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే