భార్యను కడతేర్చిన భర్త

పెద్దపల్లిరూరల్: కుటుంబ కలహాలతో భార్యను భర్త హత్య చేసిన ఘటన పెద్దపల్లి మండలం హన్మంతునిపేటలో గురువారం జరిగింది. పెద్దపల్లి సీఐ ప్రదీప్కుమార్, గ్రామస్తుల కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన కందుల పర్వతాలు, కనుకలక్ష్మి భార్యాభర్తలు. వీరికి నలుగురు కొడుకులు. ఇద్దరు వివాహాలు చేసుకొని వేరు ఉంటుండగా, మరో ఇద్దరు వీరితోనే ఉంటున్నారు. అయితే పర్వతాలు సింగరేణి ఉద్యోగం చేసి పన్నెండేళ్ల క్రితమే పదవీ విరమణ పొంది, హన్మంతునిపేటలోని తన భార్యతో కలిసి ఉంటున్నాడు.
కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. కొడుకులు సైతం వేర్వేరుగా గదుల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా సైకోలా ప్రవరిస్తున్న పర్వతాలు బుధవారం అర్ధరాత్రి తన భార్య కనుకలక్ష్మి(60) నిద్రిస్తున్న సమయంలో కర్రతో తలపై మోదాడు. వృద్ధురాలు అక్కడిక్కడే చనిపోయింది. మృతురాలి సోదరి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ ప్రదీప్కుమార్ పేర్కొన్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్లను ఆపేయండి..
- ‘టాయ్ ట్రైన్ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్’
- అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా మమతా తీర్మానం
- త్వరలోనే నిరుద్యోగ భృతి : మంత్రి కేటీఆర్
- నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదు: మంత్రి పెద్దిరెడ్డి