అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారు నగలు పట్టుబడ్డాయి. అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ. కోటీ 80 లక్షల వరకు ఉంటుందని సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వాహనంలో వీటిని ఏపీకి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సరైన ఆధారాలు లేకపోవటంతో ఆభరణాలను సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. నగలు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎక్కడి తీసుకెళ్తున్నారు.. తదితర అంశాలపై పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.