చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి 8వ ఆదివారం సందర్భంగా రూ.41,55, 888 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ శనివారం రూ.2,74,858, ఆదివారం రూ.34,50,418, సోమవారం రూ.4,30,612 ఆదాయం ఆర్జీత సేవలైన గదుల కిరాయిలు, దర్శనాల టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ.41,55,888 స్వామి వారి ఖజనాకు సమకూరినట్లు తెలిపారు.గత యేడాది బ్రహ్మోత్సవాలలో 8వ ఆదివారం రూ. 32,86,721 వచ్చిందన్నారు.ఆయనతో ఏఈవోలు వైరాగ్యం అంజయ్య, గంగా శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్ తదితరులున్నారు.