గ్రామాల్లో ప్రత్యేకంగా కొవిడ్ టీకా శిబిరాలు
అవగాహన కల్పిస్తున్న అధికారులు, నాయకులు
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న గ్రామస్తులు
మానకొండూర్ రూరల్, ఏప్రిల్ 30: లక్ష్మీపూర్ పీహెచ్సీ డాక్టర్ స్వాతి ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నేటి నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, ఏప్రిల్ 30: మండల ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 120 మందికి టీకా వేసినట్లు డాక్టర్ వసుధాభరద్వాజ్ తెలిపారు. మండలంలో 45 సంవత్సరాలు పైబడిన వారందరూ టీకా వేసుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో 50 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, ఏప్రిల్ 30: మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్లో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఈ సందర్భంగా 180 మందికి వ్యాక్సిన్ వేసినట్లు సీహెచ్వో భాస్కర్ శివం వెల్లడించారు. 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఇక్కడ వైద్యాధికారులు డాక్టర్ కిరణ్రాజ్, డాక్టర్ విద్యశ్రీ, ఫార్మాసిస్ట్ మతిన్, సిబ్బంది సరోత్తంరెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్లో..
మానకొండూర్, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 151 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు వైద్యాధికారి సంధ్యారాణి తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా మాస్కు ధరించి, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఇక్కడ సీహెచ్వో రాజు నాయక్ సూపర్వైజర్ రాజు, ఫార్మాసిస్ట్ అబీద్, సిబ్బంది పాల్గొన్నారు.
తిమ్మాపూర్లో..
తిమ్మాపూర్, ఏప్రిల్ 30 : మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్యాంపులో 150 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఇందు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని సూచించారు.