వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం ధర్మారం శివారులోని పద్మావతి రైస్ మిల్లులో టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం తనిఖీలు చేట్టారు. ఈ తనిఖీల్లో రూ. 2.30 లక్షల విలువ గల సుమారు వంద క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేయింగ్, స్టిచ్చింగ్ మిషన్లు సీజ్ చేశారు. రైస్ మిల్లు యజమాని శివకుమార్ సహా నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.