పెన్పహాడ్ పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత

సూర్యాపేట : జిల్లాలోని పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఎస్పీ ఆర్.భాస్కరన్ వెల్లడించారు. జిల్లా సీసీఎస్ పోలీసులు, పెన్పహాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన రైడ్లో అనంతారం అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న కార్లను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒక కారులో 60 కేజీల గంజాయి పొట్లాలు, మరొక కారులో 70 కేజీల గంజాయి పొట్లాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా కారు డ్రైవర్తో పాటు మరో వ్యక్తి తప్పించుకు పారిపోయారు.
నిందితులను అజ్మీరా రమేష్(మహముద్దాపురం గ్రామం), నూనావత్ విజయ్(జలమలకుంట తండా), అంగోతు నాగు(మెగ్యా తండా), భ్యుక్యా వాసు(మహముదాపురం గ్రామం), బానోతు విజయ్(సీతారాం తండా), మక్కా గణేష్(మెగ్యా తండా)గా గుర్తించారు. నూనావత్ విజయ్, మక్కా గణేష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారు. గంజాయిని వైజాగ్ నుంచి తెచ్చి హైదరాబాద్, మహారాష్ర్టలో అమ్మేందుకు వెళ్తున్నట్లుగా సమాచారం. గంజాయి రవాణాను బహిర్గతం చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ నిరంజన్, ఎస్ఐ రంజిత్, సీసీఎస్ సిబ్బంది కృష్ణ, నర్సింహారావు, రమేష్, దుర్గాప్రసాద్, గురుస్వామి, శ్రీను, పోలీస్ స్టేషన్ సిబ్బంది కనకరత్నం, జాఫర్ అలీ కు ఎస్పీ అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- ఎర్రకోట ఘటనను ఖండించిన కేంద్ర పర్యాటకశాఖ మంత్రి
- కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
- చెన్నైలో క్వారంటైన్లో బెన్స్టోక్స్
- పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
- ఈరోజు మీకు, మాకు ఎంతో ప్రియమైన రోజు: స్కాట్ మోరిసన్
- ట్రాక్టర్ పరేడ్ : ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- సైకో కిల్లర్ రాములు అరెస్టు
- టీఎంసీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం
- పాత వాహనాలపై 'గ్రీన్ టాక్స్'
- ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా