ముంబై : బాక్సింగ్ శిక్షణ పేరుతో యువతి (19) పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన జిమ్ ట్రైనర్ ఉదంతం మహారాష్ట్రలోని పూణేలో వెలుగుచూసింది. బీఏ చదువుతున్న యువతి ఆరు నెలల నుంచి జిమ్కు వెళ్లి శిక్షణ పొందుతోంది. ఆమె సోదరుడు కూడా అదే జిమ్కు వెళుతుంటాడు. జిమ్ ట్రైనర్ రాబిన్ ఆంథోని పర్యవేక్షణలో యువతి బాక్సింగ్ నేర్చుకుంటోంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో కాంధ్వా ప్రాంతంలోని ఆమె ఫ్లాట్లోనే ఆంథోని ఆమెకు బాక్సింగ్లో మెళుకువలు నేర్పుతున్నాడు.
రోజూ మాదిరిగానే ఈనెల 19న యువతి ఫ్లాట్కు వెళ్లిన ఆంథోని బాక్సింగ్ నేర్పే సాకుతో ఆమె శరీర భాగాలను అభ్యంతరకరంగా తడిమాడు. దీంతో షాక్కు గురైన బాధితురాలు అక్కడి నుంచి వెళ్లగా లిఫ్ట్ సమీపంలో మరోసారి వేధించాడు. ఆంథోని ప్రవర్తనపై యువతి తన సోదరుడికి వివరించగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంథోనిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.