వరంగల్ అర్బన్ : నిషేధిత గుట్కాను కొనుగోలు, అమ్మకం చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాస్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్ను చేపట్టింది. హ్యుందాయ్ ఐ-20 కారులో అకినేపల్లి వంశీదర్, గాజుల అనీల్, బండారి అరవింద్ గుట్కాను తరలిస్తున్నారు. రైడ్ చేసిన పోలీసులు 10 బస్తాల గుట్కాను గుర్తించి సీజ్ చేశారు. కర్ణాటకలోని బీదర్ నుంచి కొనుగోలు చేసి అమ్మేందుకు కమలాపూర్ మండలం ఉప్పల్కు వెళ్తున్నట్లుగా నిందితులు విచారణలో తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం గుట్కాను, నిందితులను ముల్కనూరు పోలీసులకు అప్పగించారు.