న్యూఢిల్లీ: లోక్సభ ఇవాళ బీజేపీ ఎంపీ స్వరూప్ శర్మ మృతికి నివాళి అర్పించింది. స్పీకర్ ఓం బిర్లా ఈ నేపథ్యంలో నివాళి సందేశం వినిపించారు. ఎంపీ రామ్ స్వరూప్ ఇవాళ ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తన అపార్ట్మెంట్లో ఆయన శవమై తేలారు. ఉదయం 6.30 నిమిషాలకు ఆయన మరణించినట్లు తేల్చారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ నియోజకవర్గం నుంచి ఆయన రెండు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రామ్ స్వరూప్ శర్మ మృతికి నివాళిగా సభ్యులు కాసేపు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఆ తర్వాత స్పీకర్ బిర్లా.. సభను రెండు గంటల పాటు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటలకు సభ సమావేశం కానున్నది.