బంజారాహిల్స్, జూలై 7: పచ్చదనంతోనే పర్యావరణాన్ని కాపాడుకోగలమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ సమీపంలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ వద్ద ఏర్పా టు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని, ఇంటింటికీ కనీసం ఆరు మొక్కలు నాటడంతో పాటు సంరక్షించుకోవాలన్నారు. కాలుష్యాన్ని నియంత్రించడం కోసం మొక్కలు నాటడం తప్పనిసరి అని, కేవలం ప్రభుత్వమే కాకుండా అందరూ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్: సోమాజిగూడ డివిజన్లోని రాజ్భవన్ రోడ్డు, ఎంఎస్ మక్తాలోని మజీద్ ఏ అన్సార్ మసీదులో పట్టణ ప్రగతిని ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ వనం సంగీత, హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలు వింటూ.. వారితో కలిసి స్వయంగా మొక్కలు నాటుతూ ముందుకు సాగారు. వీధి దీపాలతో పాటు డ్రైనేజీ, ఉచిత తాగునీటి పథకం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సర్కిల్ 17 డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, డీఈ చైతన్య, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్నారాయణ, వాటర్ వర్క్స్ జీఎం హరిశంకర్, డీజీఎం శ్రీనివాస్, మేనేజర్ మనోజ్ఞ, మాజీ కార్పొరేటర్ లక్ష్మీనారాయణమ్మ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎస్కే అహ్మద్, నాయకులు వనం శ్రీనివాస్యాదవ్, సలావుద్దీన్, పి.నాగరాజు, ఖుర్షిద్, అహ్మద్, ఫేరోజ్, కలీం, అబెద్ తదితరులు ఉన్నారు.
శ్రీనగర్కాలనీ: కాలనీవాసులకు ఆహ్లాదాన్ని అందించేలా పార్కుల సుందరీకరణ చేపట్టామని జూబ్లీహిల్స్ సర్కిల్ డీఎంసీ ఇస్లావత్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా బుధవారం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని పంచవటికాలనీ, దేవరకొండ బస్తీల్లో మొక్కలు నాటారు. కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, ఏఈ ఆనంద్, కున్వార్, టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు. కార్పొరేటర్ మాట్లాడుతూ వరదకాల్వల్లో పూడికతీత పనులు పూర్తిచేశామని తెలిపారు. సింగాడికుంట, నాయుడునగర్ల్లో వరద కాల్వను ఆమె పరిశీలించారు. దెబ్బతిన్న పై కప్పులను మార్చాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.