భోపాల్ : మధ్యప్రదేశ్లోని మొరెనా ప్రాంతానికి చెందిన 18 ఏండ్ల బాలికను అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు గుజరాత్లోని రాజ్కోట్లో అరెస్ట్ చేసి బాధితురాలిని కాపాడారు. సెప్టెంబర్ 28న బాలిక ఇంటి నుంచి అదృశ్యం కాగా అక్టోబర్ 15న రాజ్కోట్లో మధ్యప్రదేశ్ పోలీసులు ఆమెను నిందితుల చెర నుంచి విడిపించారు. నలుగురు నిందితులను భురా జాదవ్, లక్పతి జాదవ్, వినోద్ కుష్వాహ, సమీర్ కుష్వాహగా గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్లోని మొరెనా ప్రాంతానికి చెందిన వారేనని వెల్లడైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 28న బాలిక అదృశ్యం కాగా ఆమె మొబైల్ ఫోన్ కాంటాక్ట్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా మధ్యప్రదేశ్లోని శివపురి నుంచి గుజరాత్లోని రాజ్కోట్కు 48 గంటల్లో మారినట్టు గుర్తించారు. బాలికను శివపురి తీసుకువెళ్లిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై బాధితురాలిని నలుగురు నిందితులు రాజ్కోట్కు తీసుకువెళ్లారు. కిడ్నాపర్లలో ఒకరు బాలిక ప్రియుడని, వీరిద్దరూ గతంలో పలుసార్లు కలుసుకున్నారని పోలీసులు వెల్లడించారు.
తనతో సన్నిహితంగా మెలగాలని ప్రియుడు ఒత్తిడి తీసుకువస్తుండటంతో బాలిక అతడిని దూరం పెట్టింది. సెప్టెంబర్ 28న బయట కలుద్దామని బాలికను మభ్యపెట్టిన నిందితుడు ఆమె ఇంటి నుంచి రాగానే కిడ్నాప్ చేసి శివపురికి తీసుకువచ్చాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.