లక్నో : బాయ్ఫ్రెండ్తో పెండ్లి జరిపించేందుకు నిరాకరించాడనే కోపంతో కన్నతండ్రినే కడతేర్చిన కూతురి ఉదంతం యూపీలోని సంభాల్ జిల్లాలో వెలుగుచూసింది. హత్యకేసులో బాలిక ప్రీతి, ఆమె బాయ్ఫ్రెండ్ ధర్మేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ముతైన్ గ్రామంలో బాధితుడు జులై 19న పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడిని హర్పాల్ సింగ్గా గుర్తించారు. వ్యవసాయ క్షేత్రంలో బాధితుడి మృతదేహం వేలాడదీసి కనిపించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.
అయితే బాధితుడి తలపై ఇనుపరాడ్తో కొట్టడంతోనే ఆయన మరణించాడని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన బాలిక ఆమె బాయ్ఫ్రెండ్ను బదౌన్ జిల్లా ఇస్లాంనగర్లో అరెస్ట్ చేశామని సంభాల్ ఎస్పీ చక్రేష్ మిశ్రా వెల్లడించారు. నిందితులు హర్పాల్ సింగ్ను హత్య చేసి మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు.