ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాంద్రా ప్రాంతంలో 19 ఏండ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై శివారు ప్రాంతం గొవాండి నుంచి రెండు బైక్ లపై ముగ్గురు యువకులు, ఒక యువతి బాంద్రా తీరంలోని రిక్రియేషనల్ ప్రాంతానికి మంగళవారం రాత్రి వచ్చారు.
ఆపై రాత్రి 11 గంటలకు వారు యువతిని తీరప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం యువతిని వారి ఇంటి వద్ద విడిచిపెట్టి వెళ్లారు. బాధిత యువతి కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో గొవాండిలోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.