అమరావతి : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలిక మృతి చెందింది. చిత్తూర్ గ్రామీణ మండలం సిద్దన్నగారి పల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని తురకపల్లె గ్రామానికి చెందిన మానస (15)గా పోలీసులు గుర్తించారు. మానసతోపాటు చెరువులో పడిన మరో ఇద్దరు చిన్నారులను స్థానికులు అతికష్టం మీద రక్షించారు. వీరు సిద్దన్నగారి పల్లెకు ఎందుకు వచ్చారన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.