బెంగళూర్ : దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడుల ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఐదేండ్ల బాలికను పొరుగుంటి వ్యక్తి లైంగికంగా వేధించిన ఘటన నగరంలోని సంజయ్నగర్ ప్రాంతంలో కలకలం రేపింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్కు చెందిన నిందితుడు (25) ఆదివారం సాయంత్రం బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక తల్లి ఇంటికి తిరిగివచ్చిన తర్వాత విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న స్ధానికులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న సంజయ్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.