అనుమానాస్పద స్థితిలో జీహెచ్ఎంసీ ఉద్యోగి మృతి

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జవహర్నగర్ డంప్ యార్డ్ వద్ద మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి సూపర్వైజర్గా పని చేస్తున్నారు. ఆయన అదృశ్యంపై ఆదివారం జవహర్నగర్ పోలీస్స్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలు బలం చేకూరుస్తున్నాయి. హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?