అహ్మదాబాద్ : గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలో దోపిడీ దొంగల ముఠా రెండు ఏటీఎంలను కొల్లగొట్టి రూ 15.58 లక్షల నగదును దోచుకుని ఉడాయించడం కలకలం రేపింది. నాగేశ్వర్ రోడ్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు ఏటీఎంలను కట్ చేసేందుకు దోపిడీ ముఠా గ్యాస్ కట్టర్లను ఉపయోగించింది. తొలుత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను తెరిచి అందులో ఉన్న రూ 3.5 లక్షలను చోరీ చేశారు.
ఇక ఈ ఏటీఎంకు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి చొరబడిన దొంగలు అదే తరహాలో చోరీకి తెరలేపి రూ 12 లక్షలను దొంగిలించి పరారయ్యారు. ఏటీఎంల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల కంట పడకుండా వారు వాటన్నింటిపై పెయింట్ను స్ప్రే చేశారు. గతంలో రాజస్ధాన్కు చెందిన ఓ ముఠా ఏటీఎంను వాహనంలో తరలించుకుపోయిందని ఇప్పుడు గ్యాస్ కట్టర్ను ఉపయోగించి ఏటీఎం చోరీలకు పాల్పడుతున్నారని గుజరాత్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనను సవాల్గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.