శంషాబాద్, ఏప్రిల్ 2: విదేశీ కరెన్సీ అక్రమరవాణాకు యత్నించిన ఓ ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు శుక్రవారం అరెస్టుచేశారు. అతడి నుంచి పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. షార్జా వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఎయిర్పోర్టుకు వచ్చాడు. సదరు ప్రయాణికుడిని అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు.. అతడిని సోదాచేయగా.. రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత